ETV Bharat / state

యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా.. పట్టించుకోని అధికార యంత్రాంగం - నెల్లూరులో ఇసుక అక్రమ రవాణా

నెల్లూరు జిల్లాలోని పెన్నా పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్చగా సాగుతోంది. అధికారులంతా కొవిడ్ పోరులో నిమగ్నమై ఉండగా.. అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఇసుకను అర్ధరాత్రి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని పరివాహక గ్రామాల్లోని ప్రజలు ఆరోపిస్తున్నారు.

sand illigal transportation
sand illigal transportation
author img

By

Published : May 13, 2021, 9:10 AM IST

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కచేరి దేవరాపల్లిలో ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. జిల్లా అధికారులు కొవిడ్ పోరులో నిమగ్నమై ఉండగా.. అక్రమార్కులు మాత్రం తమ పని కానిచ్చేస్తున్నారు. పెన్నా నది పరివాహక ప్రాంతంలో జేసీబీల సహాయంతో ఇసుకను తవ్వి .. రాత్రి వేళల్లో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

ఫిర్యాదు చేసినప్పటికీ.. అధికారులు పట్టించుకోలేదని వారు చెబుతున్నారు.

ఇదీ చదవండి: నిర్లక్ష్యం వద్దు... సేవాభావంతో పనిచేయండి: మంత్రులు

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కచేరి దేవరాపల్లిలో ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. జిల్లా అధికారులు కొవిడ్ పోరులో నిమగ్నమై ఉండగా.. అక్రమార్కులు మాత్రం తమ పని కానిచ్చేస్తున్నారు. పెన్నా నది పరివాహక ప్రాంతంలో జేసీబీల సహాయంతో ఇసుకను తవ్వి .. రాత్రి వేళల్లో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

ఫిర్యాదు చేసినప్పటికీ.. అధికారులు పట్టించుకోలేదని వారు చెబుతున్నారు.

ఇదీ చదవండి: నిర్లక్ష్యం వద్దు... సేవాభావంతో పనిచేయండి: మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.