ETV Bharat / state

బ్రాహ్మణపల్లిలో రోడ్డు ప్రమాదం... 11 మందికి గాయాలు

కల్వర్టు రహదారిపై రోడ్డు కుంగి ఉన్న కారణంగా... రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

author img

By

Published : Mar 2, 2021, 10:32 AM IST

road accident in Brahmanapalli
బ్రాహ్మణపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వర్టు రహదారిపై రోడ్డు కుంగి ఉన్న కారణంగా.. రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

కల్వర్టు వద్ద జాతీయ రహదారి కుంగిపోయి ఉండటం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వర్టు రహదారిపై రోడ్డు కుంగి ఉన్న కారణంగా.. రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

కల్వర్టు వద్ద జాతీయ రహదారి కుంగిపోయి ఉండటం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కరోనా మొదటి కేసు వెలుగుచూసి నేటికి ఏడాది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.