ETV Bharat / state

కరోనాను మరచి.. భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకున్న భక్తులు - nellore district news

కరోనా తీవ్రత అధికంగా ఉన్నప్పటికి అక్కడి భక్తుల్లో అవేవీ కనిపించడం లేదు. పోలీసులు వారించినా పూజలు ఆపలేదు. ట్రాఫిక్​ ఆగేంతమంది అక్కడ గుమిగూడారు. కరోనాను మరచి ఎందుకలా తిరగుతున్నారు..? ఇంతకీ అదెక్కడ..? వారెందుకు జాగ్రత్తలు పాటించడం లేదు..?

no covid protocols at nayudupet temple
భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకున్న భక్తులు
author img

By

Published : May 6, 2021, 7:45 AM IST

కొవిడ్ విలయతాండవం చేస్తున్న తరుణంలో.. నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలేరమ్మ ఆలయం వద్దకు భక్తులు భారీగా చేరుకున్నారు. కరోనా నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ నేడు జాతర జరగాల్సి ఉండటంతో భక్తులు భారీ సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని పూజలు నిర్వహించారు. ఆలయానికి తలుపులు వేసి ఉన్నప్పటికీ బయటే పూజలు జరిపి మెుక్కులు చెల్లించుకున్నారు. పోలీసులు కట్టడి చేసినా వినిపించుకోలేదు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈరోజు నుంచి మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ అమలు కానుండటంతో ప్రజలు నిత్యావసరాలకోసం దుకాణాల వద్ద బారులుతీరారు.

ఇవీ చదవండి:

కొవిడ్ విలయతాండవం చేస్తున్న తరుణంలో.. నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలేరమ్మ ఆలయం వద్దకు భక్తులు భారీగా చేరుకున్నారు. కరోనా నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ నేడు జాతర జరగాల్సి ఉండటంతో భక్తులు భారీ సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని పూజలు నిర్వహించారు. ఆలయానికి తలుపులు వేసి ఉన్నప్పటికీ బయటే పూజలు జరిపి మెుక్కులు చెల్లించుకున్నారు. పోలీసులు కట్టడి చేసినా వినిపించుకోలేదు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈరోజు నుంచి మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ అమలు కానుండటంతో ప్రజలు నిత్యావసరాలకోసం దుకాణాల వద్ద బారులుతీరారు.

ఇవీ చదవండి:

భారత్​కు కొనసాగుతున్న విదేశాల సాయం

పకడ్బందీగా కర్ఫ్యూ.. బోసిపోయిన రహదారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.