కోవిడ్ నిబంధనల నడుమ... నెల్లూరు జిల్లా వెంకటగిరిలో గ్రామశక్తి పోలేరమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి నిష్క్రమణ కోసం ఈసారి పండ్లు కూరగాయలతో రథాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
కోవిడ్ నిబంధనల మేరకు భక్తులకు దర్శనాలు ఆపాల్సి వచ్చిందని ఎమ్మెల్యే ఆనం చెప్పారు. జాతర కార్యక్రమాలను సాంప్రదాయం మేరకు విజయవంతం చేయడంలో ప్రభుత్వ శాఖలు సఫలీకృతం అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీ చదవండి: