నెల్లూరు జిల్లా గూడూరులో దారుణం జరిగింది. శ్రీహరి అనే వ్యక్తి తన భార్య సుజాతపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వేములపాలెం సమీపంలోని సవకతోటలో ఈ హత్యకు పాల్పడ్డాడు. వారికి ఇద్దరు కుమారులున్నారు. కుటుంబ కలహాల కారణంగానే ఆమెను హతమార్చాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
ఇదీ చదవండి: