ETV Bharat / state

ఎన్నెన్నో చిత్రాలు... అన్నింట్లో అందాలు - undefined

ఒక మంచి చిత్రాన్ని చూసినప్పుడు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. అలాంటిది ఎన్నో భావాలను పలికించే ఎన్నో చిత్రాలన్నింటినీ ఒక్కచోట చూస్తే మర్చిపోలేని ఆనందం కలుగుతుంది. చిత్రకారులకు పేరుగాంచిన నెల్లూరు నగరంలోని పురమందిరంలో... ''కలర్స్ ఆఫ్ నెల్లూరు ఆర్ట్ ఎగ్జిబిషన్ అండ్ సేల్'' పేరుతో చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. విభిన్నమైన కళాకృతులన్నింటినీ ఒక్కచోటికి చేర్చి ఆహుతులను అలరిస్తున్నారు.

PAINTING EXHIBITION IN NELLORE
ఎన్నెన్నో చిత్రాలు....అన్నిట్లో అందాలు...
author img

By

Published : Mar 19, 2020, 5:54 PM IST

ఎన్నెన్నో చిత్రాలు... అన్నింట్లో అందాలు

కుంచె నుంచి అద్భుతమైన చిత్రాలు జాలువారేందుకు కాదేది అనర్హం అనేలా ఉన్నాయి ఈ ప్రదర్శనలో చిత్రాలు. భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలు, గ్రామీణ వాతావరణం, ప్రకృతి అందాలు ప్రతిబింబించేలా కొన్ని చిత్రాలు ఉంటే... త్రీడి మ్యూరల్స్, ఆయిల్ పెయింటింగ్స్, యాక్రిలిక్ చిత్రాలు, రంగులు లేకుండా కేవలం పెన్సిల్​తో గీసినవి, తంజావూర్ రకం, బంగారు పొరతో గీసిన చిత్రాలు, క్రాఫ్ట్ వర్క్ చిత్రాలు ఇలా విభిన్న రకాల పెయింటింగ్స్ చూపరులను అబ్బురపరుస్తున్నాయి. కళ్లు తిప్పకుండా మళ్లీమళ్లీ చూసేలా మురిపించి మైమరపిస్తున్నాయి.

ఎంతటి విషయాన్నైనా ఒక్క చిత్రంలో చూపించగలగటం చిత్రకారుల గొప్పతనం. అటువంటి ప్రతిభావంతులైన చిత్రకారులు ఈ ప్రదర్శనలో తమ కళాఖండాలను పదర్శించారు. వీరు ఎన్నో ఏళ్లుగా చిత్రాలను గీయడంలో అనుభవం ఉన్నవారు. జాతీయ, రాష్ర్ట స్థాయిలో అవార్డులు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్​లో స్థానం దక్కించుకున్నారు. యువతను చిత్రకారులుగా తయారు చేయడానికి తల్లితండ్రులు శ్రద్ధ చూపాలని వారు కోరుతున్నారు. ఈ ప్రదర్శనను చూసేందుకు నగర ప్రజలు తరలివస్తున్నారు. చిన్నపిల్లలు ఆసక్తితో తిలకిస్తున్నారు. కళాకృతులతో స్వీయ చిత్రాలు దిగుతున్నారు. తమ చరవాణుల్లో కళాఖండాలను బంధిస్తూ సందడి చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'వైకాపా ఆగడాలను ఎదుర్కొంటాం'

ఎన్నెన్నో చిత్రాలు... అన్నింట్లో అందాలు

కుంచె నుంచి అద్భుతమైన చిత్రాలు జాలువారేందుకు కాదేది అనర్హం అనేలా ఉన్నాయి ఈ ప్రదర్శనలో చిత్రాలు. భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలు, గ్రామీణ వాతావరణం, ప్రకృతి అందాలు ప్రతిబింబించేలా కొన్ని చిత్రాలు ఉంటే... త్రీడి మ్యూరల్స్, ఆయిల్ పెయింటింగ్స్, యాక్రిలిక్ చిత్రాలు, రంగులు లేకుండా కేవలం పెన్సిల్​తో గీసినవి, తంజావూర్ రకం, బంగారు పొరతో గీసిన చిత్రాలు, క్రాఫ్ట్ వర్క్ చిత్రాలు ఇలా విభిన్న రకాల పెయింటింగ్స్ చూపరులను అబ్బురపరుస్తున్నాయి. కళ్లు తిప్పకుండా మళ్లీమళ్లీ చూసేలా మురిపించి మైమరపిస్తున్నాయి.

ఎంతటి విషయాన్నైనా ఒక్క చిత్రంలో చూపించగలగటం చిత్రకారుల గొప్పతనం. అటువంటి ప్రతిభావంతులైన చిత్రకారులు ఈ ప్రదర్శనలో తమ కళాఖండాలను పదర్శించారు. వీరు ఎన్నో ఏళ్లుగా చిత్రాలను గీయడంలో అనుభవం ఉన్నవారు. జాతీయ, రాష్ర్ట స్థాయిలో అవార్డులు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్​లో స్థానం దక్కించుకున్నారు. యువతను చిత్రకారులుగా తయారు చేయడానికి తల్లితండ్రులు శ్రద్ధ చూపాలని వారు కోరుతున్నారు. ఈ ప్రదర్శనను చూసేందుకు నగర ప్రజలు తరలివస్తున్నారు. చిన్నపిల్లలు ఆసక్తితో తిలకిస్తున్నారు. కళాకృతులతో స్వీయ చిత్రాలు దిగుతున్నారు. తమ చరవాణుల్లో కళాఖండాలను బంధిస్తూ సందడి చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'వైకాపా ఆగడాలను ఎదుర్కొంటాం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.