నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్లో బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిట్రగుంటలోని కప్పరాళ్లతిప్పకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... పది సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మహిళలు బస్సులో ప్రయాణించేటప్పుడు బంగారు ఆభరణాలు మెడలో వేసుకోవటం ఉత్తమం కాదని... బ్యాగులలో ఉంచడం వల్లే చోరీలు జరుగుతున్నాయని సీఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. దొంగలతో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి: