ETV Bharat / state

కొడుకును పోలీసులు కొట్టారని... తల్లి ఆత్మహత్యాయత్నం - lady attempt to suicide in udayagiri police station

తన కుమారుడు మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడంటూ... పోలీసులు కొట్టారని ఆరోపిస్తూ... ఓ మహిళ పోలీస్​స్టేషన్ ఆవరణలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

కుమారుడిని పోలీసులు కొట్టారని తల్లి ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Nov 2, 2019, 10:29 PM IST

కుమారుడిని పోలీసులు కొట్టారని తల్లి ఆత్మహత్యాయత్నం
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన కుమారుడు మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడంటూ... పోలీసులు కొడుతున్నారని ఆరోపించింది. తమ పక్క గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను... ఈ నెల 30న ఓ యువకుడు వివాహం చేసుకున్నాడ... ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో మందలించారు.

తన కుమారుడు పోలీసుల అదుపులో ఉండటం తట్టుకోలేక... ఆ తల్లి సూపర్ వాస్మయిల్ ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. గమనించిన బంధువులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మైనర్ బాలికను వివాహం చేసుకున్న కారణంగా యువకుడిపై కేసు నమోదు చేస్తుంటే... తమను బెదిరించేందుకే యువకుడి తల్లి ఈ విధంగా చేసిందని పోలీసులు చెప్పారు.

ఇదీ చదవండి : దేపూరు వద్ద ఒకేసారి రెండు ఆలయాల్లో చోరీ

కుమారుడిని పోలీసులు కొట్టారని తల్లి ఆత్మహత్యాయత్నం
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన కుమారుడు మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడంటూ... పోలీసులు కొడుతున్నారని ఆరోపించింది. తమ పక్క గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను... ఈ నెల 30న ఓ యువకుడు వివాహం చేసుకున్నాడ... ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో మందలించారు.

తన కుమారుడు పోలీసుల అదుపులో ఉండటం తట్టుకోలేక... ఆ తల్లి సూపర్ వాస్మయిల్ ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. గమనించిన బంధువులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మైనర్ బాలికను వివాహం చేసుకున్న కారణంగా యువకుడిపై కేసు నమోదు చేస్తుంటే... తమను బెదిరించేందుకే యువకుడి తల్లి ఈ విధంగా చేసిందని పోలీసులు చెప్పారు.

ఇదీ చదవండి : దేపూరు వద్ద ఒకేసారి రెండు ఆలయాల్లో చోరీ

Intro:పోలీస్ స్టేషన్ ఆవరణలో మహిళ ఆత్మహత్యాయత్నం


Body:మైనర్ బాలికను వివాహం చేసుకున్న కుమారుడిని పోలీసులు స్టేషనుకు తీసుకొనివచ్చి కొట్టారని ఆరోపిస్తూ ఉదయగిరి మండలంలోని ఒక గ్రామానికి చెందిన మహిళ పోలీస్ స్టేషన్ ఆవరణలో సూపర్ వా స్మాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన బంధువులు వెంటనే ఆమెను ఉదయగిరి లోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువకుడు పక్క గ్రామానికి చెందిన వరుసకు బంధువులు అయినా బాలికను కొంతకాలంగా ప్రేమించాడు. ఈనెల 30వ తేదీన ఒక ఆలయంలో వివాహం చేసుకున్నాడు. కుమార్తె ప్రేమ వివాహం చేసుకున్న విషయాన్ని జీర్ణించుకోలేని బాలిక తల్లిదండ్రులు ఉదయగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ బాలిక కావడంతో పోలీసులు ఆ బాలికను వివాహం చేసుకున్న యువకుడిని స్టేషన్ కు తీసుకువచ్చి వారి విధానంలో మందలించారు. ఆ విషయాన్ని చూసిన యువకుడి తల్లి ఒక్కగానొక్క తన కుమారుడిని పోలీసులు కొడుతున్నారని మనస్థాపం చెంది స్టేషన్ ఆవరణలో వెంట తెచ్చుకున్న సూపర్ వా స్మాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే బంధువులు ఆమెను ప్రభుత్వ వైద్యశాలకు తరలించడం తో చికిత్స పొందుతుంది. పోలీసులు మాత్రం మైనర్ బాలికను వివాహం చేసుకున్న యువకుడిపై కేసు నమోదు చేస్తుంటే తమను బెదిరించేందుకు యువకుడు తల్లి అలా చేసిందని చెబుతున్నారు.


Conclusion:పోలీస్ స్టేషన్ ఆవరణలో మహిళ ఆత్మహత్యాయత్నం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.