నెల్లూరు జిల్లా నాయుడుపేటలో.. చెత్త తరలించే వాహనాలు నిలిపేందుకు ఏర్పాటు చేసిన షెడ్డు ప్రారంభోత్సవంలో గందరగోళం నెలకొంది. షెడ్డు ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే సంజీవయ్యను స్థానికులు అడ్డుకున్నారు. నాయుడుపేట పురపాలక పరిధిలో.. చెత్త తరలించే వాహనాలు నిలిపేందుకు రూ.8 లక్షల వ్యయంతో షెడ్డు నిర్మించారు. దీన్ని ఎమ్మెల్యే సంజీవయ్యతో ప్రారంభించేందుకు ఏర్పాటు చేశారు.
అయితే ఇక్కడ షెడ్డు ఏర్పాటు చేయడం వల్ల దుర్వాసనతో ఇబ్బందిపడాల్సి వస్తోందని స్థానిక బీడీ కాలనీ వాసులు ఎమ్మెల్యే సంజీవయ్యతో వాగ్వాదానికి దిగారు. ఆయన్ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కాలనీ వాసులకు మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక పరిస్థితుల మధ్యే ఎమ్మెల్యే షెడ్డును ప్రారంభించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా స్థానికులు నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: