ETV Bharat / state

'నవంబర్ 1 నుంచి.. పోలవరం పునర్నిర్మాణ పనులు'

పోలవరంలో దోపిడీని అడ్డుకోవడానికే రివర్స్ టెండరింగ్​కు వెళ్తున్నామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. త్వరలోనే కొత్త కాంట్రాక్టర్​తో పనులు ప్రారంభిస్తామన్నారు. 2021 చివరి నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

author img

By

Published : Aug 3, 2019, 3:25 PM IST

నవంబర్ 1 నుంచి పోలవరం పునర్నిర్మాణ పనులు : మంత్రి అనిల్ కుమార్
నవంబర్ 1 నుంచి పోలవరం పునర్నిర్మాణ పనులు : మంత్రి అనిల్ కుమార్

నవంబర్ ఒకటి నుంచి పోలవరం పునర్నిర్మాణ పనులు చేపడతామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. నెల్లూరు నగరంలో పర్యటించిన మంత్రి... పోలవరం టెండర్ల రద్దు కారణంగా పనులు ఆలస్యం అవుతాయన్న కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలపై స్పందించారు. పోలవరం నిర్మాణంలో అవకతవకలు, దోపిడీని నిర్మూలించేందుకు రివర్స్ టెండరింగ్​కు వెళ్తున్నామని వెల్లడించారు. వరదలతో సహజంగానే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పోలవరంలో ఎలాంటి పనులు జరగవని మంత్రి చెప్పారు. సెప్టెంబర్ కల్లా ప్రభుత్వం చేయాల్సిన అన్ని ప్రక్రియలు పూర్తిచేసి నవంబర్ నుంచి పనులు ప్రారంభిస్తామన్నారు. పోలవరంపై ఇచ్చిన నివేదికలో దాదాపు రెండు వేల కోట్లు తేడా వచ్చిందని మంత్రి అనిల్ చెప్పారు. పోలవరం నిర్మాణం విషయంలో ప్రతిపక్షాలు హడావుడి చేస్తున్నాయన్నారు. పరిస్థితిని ఉన్నతాధికారులు కేంద్రానికి వివరించారన్నారు. పారదర్శకంగా పనులు చేపట్టి 2021 ఆఖరికల్లా ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రకటించారు.

ఇదీ చదవండి : హమీలేని రుణాలంటూ మోసం.. లబోదిబోమంటున్న బాధితులు

నవంబర్ 1 నుంచి పోలవరం పునర్నిర్మాణ పనులు : మంత్రి అనిల్ కుమార్

నవంబర్ ఒకటి నుంచి పోలవరం పునర్నిర్మాణ పనులు చేపడతామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. నెల్లూరు నగరంలో పర్యటించిన మంత్రి... పోలవరం టెండర్ల రద్దు కారణంగా పనులు ఆలస్యం అవుతాయన్న కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలపై స్పందించారు. పోలవరం నిర్మాణంలో అవకతవకలు, దోపిడీని నిర్మూలించేందుకు రివర్స్ టెండరింగ్​కు వెళ్తున్నామని వెల్లడించారు. వరదలతో సహజంగానే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పోలవరంలో ఎలాంటి పనులు జరగవని మంత్రి చెప్పారు. సెప్టెంబర్ కల్లా ప్రభుత్వం చేయాల్సిన అన్ని ప్రక్రియలు పూర్తిచేసి నవంబర్ నుంచి పనులు ప్రారంభిస్తామన్నారు. పోలవరంపై ఇచ్చిన నివేదికలో దాదాపు రెండు వేల కోట్లు తేడా వచ్చిందని మంత్రి అనిల్ చెప్పారు. పోలవరం నిర్మాణం విషయంలో ప్రతిపక్షాలు హడావుడి చేస్తున్నాయన్నారు. పరిస్థితిని ఉన్నతాధికారులు కేంద్రానికి వివరించారన్నారు. పారదర్శకంగా పనులు చేపట్టి 2021 ఆఖరికల్లా ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రకటించారు.

ఇదీ చదవండి : హమీలేని రుణాలంటూ మోసం.. లబోదిబోమంటున్న బాధితులు

Intro:రిపోర్టర్ :జీ సూర్య దుర్గారావు
సెంటర్ :భీమవరం
జిల్లా :పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్Ap_tpg_44_03_bvm_bhari_mosam_story_byts_Ap10087
మొబైల్9849959923
ఈనాడు ఈటీవీ పరిశీలన కథనం సార్ ఇది.
యాంకర్ :ఎటువంటి హామీ లేకుండా ప్రతి మహిళకు రూ. 50000 ఇస్తామంటూ కొందరు వ్యక్తులు భారీ మోసానికి మోసానికి తెరలేపారు.
ఈ మోసాన్ని సంబంధించి మోసపోయిన బాధిత మహిళలు స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామంలోకి నెల రోజుల క్రితం విజయ దుర్గ హోమ్ ఫైనాన్స్ కు చెందిన వ్యక్తులమని అందరికీ రుణాలిస్తామంటూ నమ్మించారు.రూ. 50 వేల రుణం కావాలంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు న కళ్ళ తో పాటు సభ్యత్వం కింద రూ. 1500 చెల్లించాలని ఇలా చెల్లించిన వారికి ఒక కరెంట్ కుక్కర్ ను అందించారు. తిరిగి రుణం మంజూరు కావాలంటే ఇన్సూరెన్స్ కోసం అని మరో రూ.1500 చెల్లించాలంటూ ఒక్కొక్కరి వద్ద నుంచి మొత్తం రూ. మూడు వేలు వసూలు చేశారు .ఇలా విస్సాకోడేరు ఒక గ్రామంలోని సుమారు 200 మంది మహిళలు నుంచి 3 వేల చొప్పున వసూలు చేసి రుణాలు ఇవ్వకుండా పత్తా లేకుండా పోయారు .వారిచ్చిన ఫోన్ నెంబర్లు కూడా పని చేయకపోవడంతో బాధిత మహిళలు లబోదిబోమంటున్నారు. ఈ సంఘటనపై స్థానికులు ఈనాడు ఈ టీవీ కి సమాచారం ఇచ్చారు. దీంతో ఈనాడు ,ఈ టీవీ ప్రతినిధి కి బాధితులకు చెప్పిన విజయ దుర్గ హోమ్ ఫైనాన్స్ భీమవరం పేరున్న ఉన్న అడ్రస్ను ను తనిఖీ చేయగా అక్కడ ఎటువంటి కార్యాలయం గాని బోర్డు లేకపోవడం గుర్తించారు. అలాగే వారిచ్చిన ఫోన్ నెంబర్ కూడా పని చేయకపోవడంతో ఈ నెంబర్ అందుబాటులో లేదు అంటూ సమాధానం వస్తుంది. ఇటువంటి మోసం ఒక్క విస్సాకోడేరు గ్రామంలోనే కాకుండా భీమవరం, విస్సాకోడేరు, పాలకోడేరు, వీరవాసరం తదితర ప్రాంతాల్లో కూడా ఇదే ముఠా ఇదే తరహా మోసానికి పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు. వేల సంఖ్యలో మహిళలు నుంచి రూ. లక్షల రూపాయలు ఈ ముఠా దండుకున్నట్లు గ్రామాల్లో పరిస్థితి తెలియజేస్తుంది .గ్రామాల్లోని పేదరికాన్ని వాళ్ళకున్న డబ్బు అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా మోసం మోసం చేసిన వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రుణం మంజూరు విషయాన్ని గాని తమకు డబ్బులు చెల్లించిన విషయం గానీ ఎవరికైనా, పోలీసులకు అధికారులకు సమాచారం ఇస్తే తమపై కాల్ మనీ కేసులు పెడతారా అని దీంతో మహిళలకు రుణాలు ఇచ్చే అవకాశం ఉండదని వారు స్థానికులను తెలివిగా నమ్మించి మోసం చేశారు .ఇదే నిజమని నమ్మిన మహిళలు తాము నగదు చెల్లించిన విషయాన్ని కనీసం కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా కొందరు మహిళలు గోప్యంగా ఉంచారు.రూ. 50 వేల రుణం కోసం మూడు రూపాయలు వడ్డీకి అప్పులు తెచ్చి మరి మూడు వేల చెల్లించామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .చివరికి మోసపోయామని గ్రహించిన మహిళలు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
బైట్స్ 1దండే వెంకటలక్ష్మి, బాధితురాలు
2 కేత వెంకట సూర్య , విస్సాకోడేరు విలేజ్ సోల్జర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు.
3 సుజాత ,బాధితురాలు
4 చంద్ర కాంతమ్మ, బాధితురాలు


Body:నేమ్Ap_tpg_44_03_bvm_bhari_mosam_story_byts_Ap10087


Conclusion:నేమ్Ap_tpg_44_03_bvm_bhari_mosam_story_byts_Ap10087
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.