మేడే వేడుకలను ఉదయగిరిలో కార్మిక సంఘాల నాయకులు నిర్వహించారు. ఉదయగిరి పంచాయతీ బస్టాండ్ కూడలిలో రైతు సంఘం జిల్లా నాయకుడు వెంకటయ్య... కార్మిక సంఘాల నాయకులతో కలసి జండాను ఎగరవేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన అన్ని వర్గాల కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి :