ETV Bharat / state

నోట్ల కట్టలతో ఇసుక తూకం.... వినూత్నంగా నిరసన వ్యక్తం - నెల్లూరులో జనసేన నాయకుల నిరసన వార్తలు

రాష్ట్రంలో ఇసుక కొరతపై నెల్లూరులో జనసేన పార్టీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. వంద రూపాయల నోట్ల కట్టలతో.. ఇసుకను తూకం వేసి నిరసన తెలిపారు.

ఇసుకను తూకం వేస్తున్న జనసేన నాయకులు
author img

By

Published : Nov 3, 2019, 11:25 PM IST

నెల్లూరులో ఇసుకను తూకం వేసి వినూత్న నిరసన

ఇసుక కొరతపై నెల్లూరులో జనసేన పార్టీ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. ఇసుకను నోట్ల కట్టలతో తూకం వేసి ధర్నా చేపట్టారు. నగరంలోని కనకమహల్ సెంటర్ నుంచి గాంధీబొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో 30 లక్షల మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నా... ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు నెలకు రూ.10వేలు పరిహారంగా ఇవ్వాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు.

నెల్లూరులో ఇసుకను తూకం వేసి వినూత్న నిరసన

ఇసుక కొరతపై నెల్లూరులో జనసేన పార్టీ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. ఇసుకను నోట్ల కట్టలతో తూకం వేసి ధర్నా చేపట్టారు. నగరంలోని కనకమహల్ సెంటర్ నుంచి గాంధీబొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో 30 లక్షల మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నా... ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు నెలకు రూ.10వేలు పరిహారంగా ఇవ్వాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు.

ఇదీచూడండి

100 మీటర్లకు పైగా పెరిగిన కట్ట కోతలు

Intro:Ap_Nlr_01_03_Esuka_Janasena_Nirasana_Kiran_Avb_AP10064

కంట్రీబ్యుటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
ఇసుక కొరతపై నెల్లూరులో జనసేన పార్టీ వినూత్న నిరసన తెలియజేసింది. నగరంలోని కనకమహాల్ సెంటర్ నుంచి గాంధీబొమ్మ వరకు ప్రదర్శన నిర్వహించిన జనసైనికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. పుచ్చలపల్లి సుందరయ్య, గాంధీ విగ్రహాలకు నివాళులర్పించి ఇసుకకు తులాభారం నిర్వహించారు. సామాన్యులకు ఇసుక పెను భారంగా మారుతోందని తెలియజేసేలా వంద రూపాయల నోట్ల కట్టలతో ఇసుకను తూకం వేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో చేపట్టే లాంగ్ మార్చ్ పై మంత్రులు విమర్శించడాన్ని జనసేన నగర ఇంచార్జ్ వినోద్ రెడ్డి తప్పు పట్టారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు దత్తపుత్రుడిని విమర్శించడం అర్థరహితమని, జగన్ కేసీఆర్ ప్రధాని మోడీలకు దత్తపుత్రుడు కాదాని ప్రశ్నించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది కార్మికులు ఇసుక దొరక్క ఇబ్బందిపడుతున్నా ప్రజా ప్రతినిధులు కానీ, అధికారులు గాని పట్టించుకోవడంలేదని ధ్వజ మెత్తారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇసుక కొరతను నివారించాలని, కార్మికులకు పది వేల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బైట్: వినోద్ రెడ్డి, జనసేన నగర్ ఇన్ ఛార్జ్, నెల్లూరు.


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.