ETV Bharat / state

కోవిడ్ చిచ్చు: భార్యను చంపిన భర్త ... 108కి ఫోన్​ చేసినా రాలేదని ఆత్మహత్యాయత్నం - కావలిలో భార్యను హతమార్చిన భర్త

కావలిలో కొవిడ్ సోకిన భార్యను చంపిన భర్త
కావలిలో కొవిడ్ సోకిన భార్యను చంపిన భర్త
author img

By

Published : May 7, 2021, 2:17 PM IST

Updated : May 7, 2021, 4:59 PM IST

14:15 May 07

నెల్లూరు జిల్లా కావలిలో ఓ హత్య కలకలం రేపింది. అన్యోన్యంగా ఉంటున్న దంపతుల మధ్య కలతలు సృష్టించిన కరోనా.. భార్య నిండు ప్రాణాన్ని భర్తతోనే తీయించింది. 108కి ఫోన్​ చేసినా రాకపోవడంతో.. అత్యంత దారుణంగా మణికట్టు కోసి హతమార్చేలా ప్రేరేపించింది.

కొవిడ్ సోకిన భార్యను హతమార్చిన భర్త

కోవిడ్​తో బాధపడుతున్న భార్యను.. కట్టుకున్న భర్తే హతమార్చాడు. ఈ ఘటనపై.. నెల్లూరు జిల్లా కావలి సీఐ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. గత నెల 25న కోవిడ్ సోకిన దంపతులు మాల్యాద్రి, అనూరాధ.. నెల్లూరు జిల్లా కావలిలో ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. గురువారం సాయంత్రం భార్య శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండగా.. సాయం కోసం 108కి ఫోన్​ చేశారు. ఎంతకూ రాకపోవడంపై వారి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. ఈ పరిస్థితుల్లో.. ఇరువురూ ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు.

ఇదీ చదవండి: త్వరలోనే జగన్ దిల్లీ పెద్దలను కలిసే అవకాశం: ఎంపీ రఘురామ

ఈ క్రమంలో అనూరాధ చేతి మణికట్టును మాల్యాద్రి బ్లేడుతో కోసి.. అనంతరం తనూ అదే పని చేశాడు. భార్య మరణించగా స్పృహలోకి వచ్చిన మాల్యాద్రి.. ఆమె మృతికి తనే కారణంటూ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​లో లొంగిపోయాడు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉండగా.. భార్యాభర్తలకు కరోనా సోకటంతో  వారిని బందువులు ఇంటికి పంపించారు.

ఇదీ చదవండి:

కృష్ణపట్నం.. పారిశ్రామిక రాట్నం!

14:15 May 07

నెల్లూరు జిల్లా కావలిలో ఓ హత్య కలకలం రేపింది. అన్యోన్యంగా ఉంటున్న దంపతుల మధ్య కలతలు సృష్టించిన కరోనా.. భార్య నిండు ప్రాణాన్ని భర్తతోనే తీయించింది. 108కి ఫోన్​ చేసినా రాకపోవడంతో.. అత్యంత దారుణంగా మణికట్టు కోసి హతమార్చేలా ప్రేరేపించింది.

కొవిడ్ సోకిన భార్యను హతమార్చిన భర్త

కోవిడ్​తో బాధపడుతున్న భార్యను.. కట్టుకున్న భర్తే హతమార్చాడు. ఈ ఘటనపై.. నెల్లూరు జిల్లా కావలి సీఐ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. గత నెల 25న కోవిడ్ సోకిన దంపతులు మాల్యాద్రి, అనూరాధ.. నెల్లూరు జిల్లా కావలిలో ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. గురువారం సాయంత్రం భార్య శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండగా.. సాయం కోసం 108కి ఫోన్​ చేశారు. ఎంతకూ రాకపోవడంపై వారి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. ఈ పరిస్థితుల్లో.. ఇరువురూ ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు.

ఇదీ చదవండి: త్వరలోనే జగన్ దిల్లీ పెద్దలను కలిసే అవకాశం: ఎంపీ రఘురామ

ఈ క్రమంలో అనూరాధ చేతి మణికట్టును మాల్యాద్రి బ్లేడుతో కోసి.. అనంతరం తనూ అదే పని చేశాడు. భార్య మరణించగా స్పృహలోకి వచ్చిన మాల్యాద్రి.. ఆమె మృతికి తనే కారణంటూ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​లో లొంగిపోయాడు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉండగా.. భార్యాభర్తలకు కరోనా సోకటంతో  వారిని బందువులు ఇంటికి పంపించారు.

ఇదీ చదవండి:

కృష్ణపట్నం.. పారిశ్రామిక రాట్నం!

Last Updated : May 7, 2021, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.