నెల్లూరు నగరంలో వాహన తనిఖీలు చేసిన పోలీసులు అక్రమంగా తరలిస్తున్న బంగారం, వెండిని భారీగా పట్టుకున్నారు. తమిళనాడు నుంచి నెల్లూరు వస్తున్న బస్సులో ఈ బంగారం పట్టుబడింది. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న కేజీ బంగారం, 6.50 కేజీల వెండిని అధికారులు సీజ్ చేశారు. ఈ బంగారం, వెండి నెల్లూరుకు చెందిన వ్యాపారిదిగా గుర్తించిన అధికారులు, దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ 60 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
![gold](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9930618_762_9930618_1608360469668.png)
ఇదీ చదవండి: