నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబుకు మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి లేఖ రాశారు. ఎలాంటి షరతులు విధించకుండా ఎంటీయూ 1010 రకం ధాన్యం కొనుగోలు చేయాలని లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం పుట్టికి 1050-1200 కిలోలు తీసుకుంటున్నారని.. పుట్టికి 850 కిలోలు తీసుకుని కనీస మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. గత సీజన్ ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని లేఖలో డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
నెల్లూరు జిల్లాలో విషాదం.. ప్రియుడి మృతి తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య