ETV Bharat / state

కరోనా బాధితుల మృతదేహాలను చెత్త ట్రాక్టర్​లో తరలింపు

author img

By

Published : Aug 12, 2020, 5:10 AM IST

కొవిడ్ మృతులకు గౌరవప్రదంగా అంత్యక్రియలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా కొన్ని చోట్ల అలా జరగటం లేదు. కావలిలో జరిగిన ఓ ఘటన దీనికి నిదర్శనంగా మారింది. కావలి ఏరియా ఆస్పత్రి నుంచి కరోనా బాధితుల మృతదేహాలను మున్సిపల్ సిబ్బంది చెత్త ట్రాక్టర్​లో తరలించారు.

Corona victims' dead bodies were moved in a garbage tractor
Corona victims' dead bodies were moved in a garbage tractor

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కావలి ఏరియా ఆస్పత్రి నుంచి కరోనా మృతదేహాలను చెత్త తరలింపుకు వినియోగించే ట్రాక్టర్​లో మున్సిపల్ సిబ్బంది తరలించారు. ప్రభుత్వ ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోకుండా దారుణంగా ప్రవర్తించారు.

కావలి ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు వ్యక్తులు కరోనాతో మరణించారు. వారి మృతదేహాలను ఖననం చేసేందుకు మున్సిపల్ సిబ్బంది మున్సిపాలిటీ చెత్త ట్రాక్టర్​లో తరలించారు. మున్సిపల్, ఆసుపత్రి సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. కరోనా మృతదేహాలను అంబులెన్స్​లో తరలించాలని నిబంధన ఉంది. కానీ ఈ నిబంధనను నెల్లూరు జిల్లాలో కొన్ని చోట్ల అధికారులు పాటించడం లేదు. గతంలో కూడా కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను పెన్నానదిలో జేసీబీతో పూడ్చిపెట్టిన విషయం తెలిసిందే.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కావలి ఏరియా ఆస్పత్రి నుంచి కరోనా మృతదేహాలను చెత్త తరలింపుకు వినియోగించే ట్రాక్టర్​లో మున్సిపల్ సిబ్బంది తరలించారు. ప్రభుత్వ ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోకుండా దారుణంగా ప్రవర్తించారు.

కావలి ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు వ్యక్తులు కరోనాతో మరణించారు. వారి మృతదేహాలను ఖననం చేసేందుకు మున్సిపల్ సిబ్బంది మున్సిపాలిటీ చెత్త ట్రాక్టర్​లో తరలించారు. మున్సిపల్, ఆసుపత్రి సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. కరోనా మృతదేహాలను అంబులెన్స్​లో తరలించాలని నిబంధన ఉంది. కానీ ఈ నిబంధనను నెల్లూరు జిల్లాలో కొన్ని చోట్ల అధికారులు పాటించడం లేదు. గతంలో కూడా కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను పెన్నానదిలో జేసీబీతో పూడ్చిపెట్టిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి

రాష్ట్రంలో మరో 9,024 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.