ETV Bharat / state

'పౌరసత్వ సవరణ చట్టంపై బహిరంగ చర్చకు సిద్ధమా..?'

author img

By

Published : Feb 10, 2020, 4:43 PM IST

పౌరసత్వ సవరణ చట్టంపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి మండిపడ్డారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు.

bjp-leader-anjaneya-reddy-fire-on-mla-sridhar-reddy-over-caact
bjp-leader-anjaneya-reddy-fire-on-mla-sridhar-reddy-over-caact
సీఏఏపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్న భాజపా నేత ఆంజనేయరెడ్డి

పౌరసత్వ సవరణ చట్టంపై రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు నాటకాలు ఆడుతున్నాయని నెల్లూరులో భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి విమర్శించారు. మైనార్టీలను భయాందోళనలకు గురి చేసే వారంతా దేశద్రోహులంటూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు . సీఏఏపై సభలు పెడుతూ మైనార్టీలను రెచ్చగొడుతూ, వారిని అభద్రతాభావానికి గురి చేస్తున్న వారే దేశద్రోహులని ధ్వజమెత్తారు. అవగాహన లేకుండా చట్టంపై విమర్శలు చేయడం దారుణమన్నారు. పౌరసత్వ చట్టంపై బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు.

సీఏఏపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్న భాజపా నేత ఆంజనేయరెడ్డి

పౌరసత్వ సవరణ చట్టంపై రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు నాటకాలు ఆడుతున్నాయని నెల్లూరులో భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి విమర్శించారు. మైనార్టీలను భయాందోళనలకు గురి చేసే వారంతా దేశద్రోహులంటూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు . సీఏఏపై సభలు పెడుతూ మైనార్టీలను రెచ్చగొడుతూ, వారిని అభద్రతాభావానికి గురి చేస్తున్న వారే దేశద్రోహులని ధ్వజమెత్తారు. అవగాహన లేకుండా చట్టంపై విమర్శలు చేయడం దారుణమన్నారు. పౌరసత్వ చట్టంపై బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర ప్రజలపై భారం.. విద్యుత్ ఛార్జీలు పెంపు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.