నెల్లూరులోని కరెంట్ ఆఫీస్ సెంటర్ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సంగం మండలంలోని బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్న రవీంద్రనాథ్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి హతమార్చారు. గొంతు, పొత్తి కడుపులో గాయపరచటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఉద్యోగ పని నిమిత్తం రవీంద్రనాథ్ విజయవాడకు వెళ్లి వచ్చిన అనంతరం ఘటన జరిగింది.
విషయం తెలుసుకున్న వేదాయపాళెం పోలీస్స్టేషన్ సీఐ సుబ్బారావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యకు గల కారణాలు, హంతకుల జాడ తెలియలేదని..దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. మృతుడికి వచ్చే నెలలో వివాహం నిశ్చయమైందని బంధువులు తెలిపారు.
ఇదీ చదవండి: రైలు ఢీకొని బధిర బాలుడు మృతి