నెల్లూరు నగరంలోని అయ్యప్పగుడి సెంటర్ దగ్గర స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆటోలో తరలిస్తున్న రూ. 6 లక్షలు విలువ చేసే మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. నిందితుడు బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన కమలాకర్ గా పోలీసులు గుర్తించారు.
అడిషనల్ ఎస్పీ శ్రీధర్ రావుకు అందిన సమాచారం మేరకు దాడి చేసినట్లు తెలిపారు. 556 మద్యం సీసాలను సీజ్ చేసిన్నట్లు వెల్లడించారు. అక్రమంగా మద్యం తరలింంచినా, విక్రయాలు చేసినా.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి ఉదయగిరిలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే మేకపాటి