Investigation in Kadapa Jail on Dastagiri Complaint: మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఇచ్చిన ఫిర్యాదుపై రెండో రోజు కొనసాగింది. కడప జైల్లో ఉండగా వివేక హత్య కేసులో ఐదో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి బెదిరించారన్న ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టారు. న్యాయవాదితో విచారణ గదిలోకి లోపలికి వెళ్లిన చైతన్య రెడ్డి విచారణ అధికారి ముందు మాత్రం ఒక్కరే హాజరయ్యారు. కేవలం అరగంటలోపు మాత్రమే విచారణ పూర్తి చేసుకొని బయటికి వచ్చారు. 2023 నవంబర్ 28న కడప జైల్లో ఉన్న సమయంలో 20 కోట్లు ఆఫర్ చేశారని దస్తగిరి ఆరోపించారు. అంత కీలకమైన అంశాలపైన విచారణ అధికారి రాహుల్ కేవలం అరగంటలోపే విచారణ పూర్తి చేసి డాక్టర్ చైతన్య రెడ్డిని బయటకు పంపించడం పైన సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
విచారణకు హాజరైన జైలు గత సూపరింటెండెంట్: ఈ కేసులో గతంలో కడప జైలు సూపరింటెండెంట్గా పనిచేసిన ప్రకాష్ కూడా విచారణకు హాజరయ్యారు. విచారణ అధికారి రాహుల్ శ్రీరామ ఎదుట హాజరయ్యారు. ప్రస్తుతం నెల్లూరు జైలు సూపరింటెండెంట్గా పనిచేస్తున్న ప్రకాశ్ ఇవాళ విచారణ హాజరయ్యారు. 2023 నవంబర్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరిని జైల్లో సూపరింటెండెంట్ ప్రకాష్ ఇబ్బంది పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డాక్టర్ చైతన్య రెడ్డి జైల్లో కూర్చున్న సమయంలో ఆయనకు అండగా నిలిచారనేది ప్రకాష్పై అభియోగాలు. సీసీటీవీ ఫుటేజ్ మాయంపైనా విచారణ అధికారి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఎందుకు దస్తగిరినీ చీకటి గదిలో బంధించాల్సి వచ్చిందని ఆయన చేత ఎందుకు లెటర్ రాయించుకున్నవనే దానిపై విచారణ అధికారి ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.
రెండు రోజుల పాటు రెక్కీ చేసి ఐఫోన్లు చోరీ - 24 గంటల్లోపే ఇలా దొరికేశారు!
సీసీ కెమెరాల్లేవు- బ్లేడ్ బ్యాచ్లకు అడ్డాగా విజయవాడ రైల్వే స్టేషన్