Locals protest against the relocation of the Mandal Center: ఎన్టీఆర్ జిల్లాలోని వీరులపాడు మండల కేంద్రాన్ని వీరులపాడు నుంచి జుజ్జురుకు తరలించనున్నారు అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో మండల కేంద్రమైన వీరులపాడులో గ్రామ పెద్దలు, యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రం తరలిపోకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆగ్రహంతో ఊగిపోయిన యువకులు స్థానికంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫ్లెక్సీలను చించి కాల్చివేశారు. మొండితోక జగన్మోహన్రావు అరుణ్ కుమారుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. మండల కేంద్రం తరలింపుకు వ్యతిరేకంగా రేపు బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి: