ETV Bharat / state

Devineni Uma on Margadarsi: ఈనాడుపై కక్ష్యతో మార్గదర్శిపై దాడులు: దేవినేని ఉమా

author img

By

Published : Aug 19, 2023, 8:32 AM IST

Updated : Aug 19, 2023, 12:05 PM IST

Devineni Uma Comments on Attacks on Margadarsi: రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ఈటీవీ, ఈనాడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకనే సీఎం జగన్‌ మార్గదర్శిపై ముప్పేట దాడి చేయిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఉద్యోగం ఇవ్వడం చేతకాని ముఖ్యమంత్రి.. ఈనాడు, మార్గదర్శి సంస్థల ద్వారా ఉపాధి పొందుతున్న లక్షలాది మందిని రోడ్డున పడేయడానికి కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు.

Devineni Uma on Margadarsi
Devineni Uma on Margadarsi

Devineni Uma Comments on Attacks on Margadarsi : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలను ఈనాడు దినపత్రిక, ఈటీవీ ఛానల్‌లో ప్రశ్నిస్తుందనే మార్గదర్శిపై దాడులు చేయిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. నందిగామలో శుక్రవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

సైకో సీఎం జగన్ మోహన్​ రెడ్డి ఈనాడుపై కక్ష్యతో మార్గదర్శిపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో దాడులు చేయిస్తున్నారని దేవినేని ఉమా ఆరోపించారు. సీఎంకు పరిపాలన చేయటం చేతకాక చతికలపడి ఈనాడు, ఈటీవీ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మార్గదర్శిపై ముప్పేట దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే సీఐడీ, రిజిస్ట్రేషన్ల శాఖలతో దాడులు చేయించారని ఆయన తెలిపారు. పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులతోను దాడులు చేయిస్తున్నారని విమర్శించారు.

Attacks on Margadarsi Offices: కోర్టు ఆదేశాలు బేఖాతరు.. మార్గదర్శిపై మళ్లీ దాడులు

ఇవన్నీ అయిపోయ్యాక తూనికలు, కొలతల శాఖ అధికారులను సైతం తీసుకరా జగన్‌రెడ్డి అని ప్రశ్నించారు. సీఎం ఎన్ని కేసులు పెట్టుకున్న 87 ఏళ్ల సింహం లెజండ్‌ రామోజీరావు.. తెగులు జాతి గర్వపడే వ్యక్తి అని ఆయన కొనియాడారు. ఈనాడు పత్రిక ద్వారా తెలుగు భాష సమాజంలో మంచి గుర్తింపు వచ్చేలా కృషి చేశారని అన్నారు. తెలుగు భాష వ్యాప్తికి ఈనాడు అన్నివేళలా కృషి చేస్తుందని తెలిపారు. ఎన్నో దశాబ్ధాలు నుంచి పత్రికలు ఉన్నా తర్వాత వచ్చిన ఈనాడు జర్నలిజంలో కొత్త మార్గాన్ని చూపించిందని ఆయన గుర్తు చేశారు.

సీఎం జగన్ అవినీతి, అక్రమాలు, ఇసుక, మైనింగ్, మద్యం, సెంటు పట్టా భూముల కొనుగోలులో చేసిన రూ. లక్షల కోట్లు దోపిడీని ఈనాడు పత్రిక బయట పెడుతుందనే కక్ష్య కట్టారని విమర్శించారు. దీని కారణంగానే మార్గదర్శిని అగ్రిగోల్డ్‌ సంస్థతో పొల్చి తనిఖీలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామన్న సీఎం జగన్.. హామీ విస్మరించారని తెలిపారు.

AP CID Officers Attend to Telangana High Court: మార్గదర్శి కేసు.. ఏపీ సీఐడీ అధికారులపై తెలంగాణ హైకోర్టు అసహనం

ఎంతో మందికి ఉపాధి : రామోజీరావు ప్రత్యక్షంగా లక్ష్మ కుటుంబాలకు మార్గం చూపించారని కొనియాడారు. రామోజీ గ్రూపు సంస్థలతో లక్ష కుటుంబాలు ముడిపడి ఉన్నాయని దేవినేని ఉమా అన్నారు. లక్ష్మ కుటుంబాలను రోడ్డు మీదకు తీసుకొచ్చి జీవనోపాధి దెబ్బతీయటానికి సీఎం ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పరోక్షంగా కొన్ని లక్షల కుటుంబాలు రామోజీరావుపై ఆధారపడి ఉన్నాయని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగం ఇవ్వటం చేతకాక చేతులేత్తేశారని అన్నారు.

మార్గదర్శిపై ఎన్నిరకాల దాడులు చేసిన రామోజీరావును ఇంచు కూడ కదిలించలేవని, ఆయన్ను ఏమీ చేయలేరని సవాల్‌ చేశారు. ఆయన ఎవ్వరికి భయపడే వ్యక్తి కాదని దేవినేని ఉమా తెలిపారు. ఎమర్జెన్సీ రోజుల్లోనే ప్రభుత్వాల తాకిడి తట్టుకుని నిలబడిన పత్రిక ఈనాడు అన్నారు. సీఎం జగన్ న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించట్లేదని అన్నారు. అదే విధంగా వివిధ పత్రికపై, టీవీ ఛానెళ్లపై సీఎం కక్ష్యతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఎప్పుడు ఎన్నికలు వచ్చిన వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ మాజీ ప్రధానకార్యదర్శి కోట వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Nara Lokesh Fire on CM Jagan About Margadarsi: ''మార్గదర్శిపై దాడులతో భయపెట్టాలని చూడటం.. సైకో చర్యలే''

Devineni Uma on Margadarsi ఈనాడుపై కక్ష్యతో మార్గదర్శిపై దాడులు

Devineni Uma Comments on Attacks on Margadarsi : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలను ఈనాడు దినపత్రిక, ఈటీవీ ఛానల్‌లో ప్రశ్నిస్తుందనే మార్గదర్శిపై దాడులు చేయిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. నందిగామలో శుక్రవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

సైకో సీఎం జగన్ మోహన్​ రెడ్డి ఈనాడుపై కక్ష్యతో మార్గదర్శిపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో దాడులు చేయిస్తున్నారని దేవినేని ఉమా ఆరోపించారు. సీఎంకు పరిపాలన చేయటం చేతకాక చతికలపడి ఈనాడు, ఈటీవీ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మార్గదర్శిపై ముప్పేట దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే సీఐడీ, రిజిస్ట్రేషన్ల శాఖలతో దాడులు చేయించారని ఆయన తెలిపారు. పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులతోను దాడులు చేయిస్తున్నారని విమర్శించారు.

Attacks on Margadarsi Offices: కోర్టు ఆదేశాలు బేఖాతరు.. మార్గదర్శిపై మళ్లీ దాడులు

ఇవన్నీ అయిపోయ్యాక తూనికలు, కొలతల శాఖ అధికారులను సైతం తీసుకరా జగన్‌రెడ్డి అని ప్రశ్నించారు. సీఎం ఎన్ని కేసులు పెట్టుకున్న 87 ఏళ్ల సింహం లెజండ్‌ రామోజీరావు.. తెగులు జాతి గర్వపడే వ్యక్తి అని ఆయన కొనియాడారు. ఈనాడు పత్రిక ద్వారా తెలుగు భాష సమాజంలో మంచి గుర్తింపు వచ్చేలా కృషి చేశారని అన్నారు. తెలుగు భాష వ్యాప్తికి ఈనాడు అన్నివేళలా కృషి చేస్తుందని తెలిపారు. ఎన్నో దశాబ్ధాలు నుంచి పత్రికలు ఉన్నా తర్వాత వచ్చిన ఈనాడు జర్నలిజంలో కొత్త మార్గాన్ని చూపించిందని ఆయన గుర్తు చేశారు.

సీఎం జగన్ అవినీతి, అక్రమాలు, ఇసుక, మైనింగ్, మద్యం, సెంటు పట్టా భూముల కొనుగోలులో చేసిన రూ. లక్షల కోట్లు దోపిడీని ఈనాడు పత్రిక బయట పెడుతుందనే కక్ష్య కట్టారని విమర్శించారు. దీని కారణంగానే మార్గదర్శిని అగ్రిగోల్డ్‌ సంస్థతో పొల్చి తనిఖీలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామన్న సీఎం జగన్.. హామీ విస్మరించారని తెలిపారు.

AP CID Officers Attend to Telangana High Court: మార్గదర్శి కేసు.. ఏపీ సీఐడీ అధికారులపై తెలంగాణ హైకోర్టు అసహనం

ఎంతో మందికి ఉపాధి : రామోజీరావు ప్రత్యక్షంగా లక్ష్మ కుటుంబాలకు మార్గం చూపించారని కొనియాడారు. రామోజీ గ్రూపు సంస్థలతో లక్ష కుటుంబాలు ముడిపడి ఉన్నాయని దేవినేని ఉమా అన్నారు. లక్ష్మ కుటుంబాలను రోడ్డు మీదకు తీసుకొచ్చి జీవనోపాధి దెబ్బతీయటానికి సీఎం ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పరోక్షంగా కొన్ని లక్షల కుటుంబాలు రామోజీరావుపై ఆధారపడి ఉన్నాయని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగం ఇవ్వటం చేతకాక చేతులేత్తేశారని అన్నారు.

మార్గదర్శిపై ఎన్నిరకాల దాడులు చేసిన రామోజీరావును ఇంచు కూడ కదిలించలేవని, ఆయన్ను ఏమీ చేయలేరని సవాల్‌ చేశారు. ఆయన ఎవ్వరికి భయపడే వ్యక్తి కాదని దేవినేని ఉమా తెలిపారు. ఎమర్జెన్సీ రోజుల్లోనే ప్రభుత్వాల తాకిడి తట్టుకుని నిలబడిన పత్రిక ఈనాడు అన్నారు. సీఎం జగన్ న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించట్లేదని అన్నారు. అదే విధంగా వివిధ పత్రికపై, టీవీ ఛానెళ్లపై సీఎం కక్ష్యతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఎప్పుడు ఎన్నికలు వచ్చిన వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ మాజీ ప్రధానకార్యదర్శి కోట వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Nara Lokesh Fire on CM Jagan About Margadarsi: ''మార్గదర్శిపై దాడులతో భయపెట్టాలని చూడటం.. సైకో చర్యలే''

Devineni Uma on Margadarsi ఈనాడుపై కక్ష్యతో మార్గదర్శిపై దాడులు
Last Updated : Aug 19, 2023, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.