ETV Bharat / state

సోము వీర్రాజును బీజేపీ నుంచి తొలగించాలని.. దళిత సంఘాలు ఆందోళన

author img

By

Published : Feb 15, 2023, 10:13 AM IST

Updated : Feb 15, 2023, 10:40 AM IST

Dalit lands were captured by Somu Virraj : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి వ్యతిరేకంగా పుస్తక మహోత్సవ ప్రాంగణంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందజేసేందుకు ప్రయత్నించిన రాష్ట్ర దళిత సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులను పోలీసులు నిలువరించడం ఉద్రిక్తతలకు దారితీసింది. దళితుల భూములను అక్రమంగా కబ్జా చేసి, తప్పుడు రిజిస్ట్రేషన్‌లు చేసుకుంటూ దళితులను ఆ భూముల్లోకి రానీయకుండా అడ్డుపడుతున్నారని.. వినతిపత్రం తీసుకుని విచారణ చేయించాలంటూ నినాదాలు చేశారు. కాన్వాయ్‌ ముందుకు సాగిన తర్వాత వీర్రాజుకు వ్యతిరేకంగా ప్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేశారు.

Dalit lands were captured by Somu Virraj
Dalit lands were captured by Somu Virraj
సోము వీర్రాజును బీజేపీ నుంచి తొలగించాలని.. దళిత సంఘాలు ఆందోళన

Dalit lands were captured by Somu Virraj : విజయవాడ నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న 33వ పుస్తక మహోత్సవంలో మంగళవారం రసాభాస చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా పుస్తక మహోత్సవ ప్రాంగణంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందజేసేందుకు ప్రయత్నించిన రాష్ట్ర దళిత సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులను పోలీసులు నిలువరించడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతున్న కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఎదుట దళిత సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ నాయకులు లక్ష్మీపతిరాజా, వల్లభనేని సుధాకర్‌లు దళితుల భూములను కబ్జా చేసి, దొంగ రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారని, ఆ భూముల్లోకి రానీయకుండా దౌర్జన్యం చేయిస్తున్నారంటూ నినాదాలు చేశారు. ఈ విషయమై మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వారు ప్రయత్నించగా.. ఆయన దానిని తీసుకోకుండా వెళ్లిపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దళిత సంఘాల నాయకులు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి, డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. సమతా సైనిక్‌ దళ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు మాట్లాడుతూ.. ‘గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్‌ చినకాకాని గ్రామ పంచాయతీ పరిధిలో డీ నెంబరు 233/బిలో 4404 చదరపు గజాల భూమిని 2014లో దళిత సామాజిక వర్గానికి చెందిన గొల్ల వరప్రసాద్‌ కొనుగోలు చేశారు.

అదే సర్వే నెంబరులోని మరో 2.30 ఎకరాలను కూడా ఆయన విక్రయ అగ్రిమెంటు చేయించుకున్నారు. ఈ భూమిలోకి అతడిని రానీయకుండా బద్రిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఇబ్బంది పెడుతున్నారు. సోము వీర్రాజు, నేతలు లక్ష్మీపతిరాజా, వల్లభనేని సుధాకర్‌లు.. వరప్రసాద్‌ భూమిని కబ్జా చేసి రూ.కోట్లలో లబ్ధి పొందేందుకు చూస్తున్నారు...’ అని ఆరోపించారు. దీనిపై కిషన్‌రెడ్డికి వినతిపత్రాన్ని ఇచ్చేందుకు వస్తే పోలీసులతో అడ్డుకోవడం హేయమైన చర్య అని పేర్కొన్నారు.

ఇవీ చదవండి :

సోము వీర్రాజును బీజేపీ నుంచి తొలగించాలని.. దళిత సంఘాలు ఆందోళన

Dalit lands were captured by Somu Virraj : విజయవాడ నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న 33వ పుస్తక మహోత్సవంలో మంగళవారం రసాభాస చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా పుస్తక మహోత్సవ ప్రాంగణంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందజేసేందుకు ప్రయత్నించిన రాష్ట్ర దళిత సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులను పోలీసులు నిలువరించడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతున్న కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఎదుట దళిత సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ నాయకులు లక్ష్మీపతిరాజా, వల్లభనేని సుధాకర్‌లు దళితుల భూములను కబ్జా చేసి, దొంగ రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారని, ఆ భూముల్లోకి రానీయకుండా దౌర్జన్యం చేయిస్తున్నారంటూ నినాదాలు చేశారు. ఈ విషయమై మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వారు ప్రయత్నించగా.. ఆయన దానిని తీసుకోకుండా వెళ్లిపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దళిత సంఘాల నాయకులు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి, డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. సమతా సైనిక్‌ దళ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు మాట్లాడుతూ.. ‘గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్‌ చినకాకాని గ్రామ పంచాయతీ పరిధిలో డీ నెంబరు 233/బిలో 4404 చదరపు గజాల భూమిని 2014లో దళిత సామాజిక వర్గానికి చెందిన గొల్ల వరప్రసాద్‌ కొనుగోలు చేశారు.

అదే సర్వే నెంబరులోని మరో 2.30 ఎకరాలను కూడా ఆయన విక్రయ అగ్రిమెంటు చేయించుకున్నారు. ఈ భూమిలోకి అతడిని రానీయకుండా బద్రిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఇబ్బంది పెడుతున్నారు. సోము వీర్రాజు, నేతలు లక్ష్మీపతిరాజా, వల్లభనేని సుధాకర్‌లు.. వరప్రసాద్‌ భూమిని కబ్జా చేసి రూ.కోట్లలో లబ్ధి పొందేందుకు చూస్తున్నారు...’ అని ఆరోపించారు. దీనిపై కిషన్‌రెడ్డికి వినతిపత్రాన్ని ఇచ్చేందుకు వస్తే పోలీసులతో అడ్డుకోవడం హేయమైన చర్య అని పేర్కొన్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Feb 15, 2023, 10:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.