ETV Bharat / state

CM Jagan Negligence on Srisailam Dam: నాడు శ్రీశైలం డ్యామ్ భద్రతపై తెగ బాధ పడిపోయావ్.. నేడు సీఎంగా ఏం చేస్తున్నావ్..?

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2023, 10:05 AM IST

CM Jagan Negligence on Srisailam Dam: రాయలసీమ, తెలంగాణకు ప్రాణావసర జలాశయం శ్రీశైలం. కీలకమైన ఈ ప్రాజెక్టు భద్రత ప్రశ్నార్థకంగా ఉన్నా వైసీపీ సర్కార్ మాత్రం ఇంకా మొద్దు నిద్రలోనే ఉంది. ముఖ్యమంత్రి జగన్‌కు ఈ ప్రాజెక్టు భద్రత విషయాలు తెలియవు ఏమో అని సరిపుచ్చుకోవడానికీ లేదు. ఆయన ప్రతిపక్షనాయకుడిగా ఉన్న సమయంలో ఆ ప్రాజెక్టును సందర్శించి.. డ్యాం భద్రతను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని తెగ బాధపడిపోయారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక మాత్రం ప్రాజెక్టును గాలికొదిలేశారు.

CM Jagan Negligence on Srisailam Dam
CM Jagan Negligence on Srisailam Dam

CM Jagan Negligence on Srisailam Dam: శ్రీశైలం డ్యామ్ భద్రతపై నాడు తెగ బాధపడిపోయావ్.. నేడు సీఎంగా ఏం చేస్తున్నావ్..?

CM Jagan Negligence on Srisailam Dam: 2017 జనవరి 6న ప్రతిపక్షనేత హోదాలో శ్రీశైలం డ్యామ్‌ను సందర్శించినప్పుడు.. డ్యామ్ భద్రతపై జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నిజంగా ప్రాజెక్టు భద్రతపై ఇంత ఆందోళన వ్యక్తం చేశారంటే.. అధికారంలోకి రాగానే తప్పకుండా చర్యలు తీసుకొని ఉంటారని అనుకుంటే పొరపాటే. రాయలసీమ ముద్దుబిడ్డ అని చెప్పుకునే జగన్‌.. అధికారంలో కొచ్చి నాలుగేళ్లయినా మీకు శ్రీశైలం భద్రతపై చీమ కుట్టినట్లయినా లేదా? ప్లంజ్‌ పూల్‌ అలాగే కొనసాగితే డ్యాం దెబ్బతినే ప్రమాదం ఉందని మీరే గోల పెట్టారే! మరి మీ ప్రభుత్వ హయాంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెబుతారా? సాగునీటి ప్రాజెక్టులు, వరద జలాలు అంటూ ఎన్నో కథలు చెప్తుంటారు కదా.. శ్రీశైలం ప్రాజెక్టుకు కనీస నిర్వహణ ఖర్చులు సైతం ఎందుకు ఇవ్వడం లేదు? అవసరమైన సిబ్బందిని ఎందుకు నియమించడం లేదు? డ్యాం భద్రత కమిటీ అధ్యయనం చేయించాలని సిఫార్సు చేస్తే ఇంకా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

'శ్రీశైలం ఆనకట్ట పరిరక్షణకు పరిశోధనలు అవసరం'

శ్రీశైలం ప్రాజెక్టులో ప్లంజ్‌పూల్‌ సుదీర్ఘ కాల సమస్య. స్పిల్ వే నుంచి నీరు అతి వేగంగా కిందకు ప్రవహించే క్రమంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. నీటి ఉద్ధృతి కారణంగా లోతు పెరగడం వలన ప్రస్తుతం 100 మీటర్లకు పైగానే ఉన్నట్టు అంచనా. ఇది స్పిల్ వే వైపు కూడా విస్తరిస్తోంది. దీనివల్ల శ్రీశైలం డ్యామ్ ప్రమాదం అంచున ఉందని జలవనరులశాఖ అధికారులే అంగీకరిస్తున్నారు. ఈ ప్లంజ్‌పూల్‌ పూడ్చేందుకు, కాంక్రీటు వేసేందుకు ఎప్పుడో 725 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించారు.

కాంక్రీటుతో పూడ్చటం వల్ల సమస్య పరిష్కారం కాదని, దీనిపై అత్యవసరంగా సమగ్ర అధ్యయనం చేయాలని.. కేంద్ర జలసంఘం విశ్రాంత ఛైర్మన్ ఎ. బి. పాండ్యా అధ్యక్షతన ఏర్పడిన కమిటీ తేల్చి చెప్పింది. డ్యాం భద్రతపై ఈ కమిటీ 2020వ సంవత్సరం నుంచి అధ్యయనం చేసి.. 2021లో నివేదికను సమర్పించింది. ఆ తర్వాత 2022లో మరోసారి సిఫార్సులు చేసింది. ఈ అధ్యయనానికి 15 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. నమూనా, జియోలాజికల్ అధ్యయనాలు, పియర్స్ సామర్థ్యంపై విశ్లేషణ, డ్యాం అండర్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఇలా వివిధ అంశాలకు సంబంధించి న్యూమరికల్ ఎనాలసిస్ చేయాల్సి ఉంది.

srisailam dam : శ్రీశైలం ప్లంజ్ పూల్ పనులకు ఉత్త చేయేనా..?

శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన సిబ్బంది కనీస స్థాయిలో కూడా లేరు. ఇక్కడ పని చేయడమంటే పనిష్​మెంట్​గా భావిస్తూ ఎవరూ రావటం లేదు. ఒకవేళ వచ్చినా.. స్థానికంగా నివాసం ఉండరు. మొత్తం 22 మంది జూనియర్ ఇంజినీర్లకుగాను కేవలం 6 మంది మాత్రమే ఉన్నారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు 10 మందికిగాను ఒక్కరే ఉన్నారు. ఈ డ్యాం నిర్వహణ చూడటానికే సిబ్బంది సరిపోరని, అధ్యయన ప్రతిపాదనలు సిద్ధం చేయడానికీ సాధ్యం కాని పరిస్థితులున్నాయని.. ఉన్నతాధికారులే అంగీకరిస్తున్నారు. మరోపక్క వైసీపీ ప్రభుత్వం డ్యామ్‌ను పక్కన పెట్టేసింది.

ప్లంజ్ పూల్ వల్ల ఏప్రాన్ కూడా ధ్వంసమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తన నిధులతో ఈ పనులు చేపట్టవచ్చు. డ్రిప్ కింద ప్రతిపాదనలను పంపించినా ఇప్పటికీ వాటికి నిధులను మంజూరు చేయలేదు. గతంలో శ్రీశైలం ప్రాజెక్టులో చిన్న చిన్న పనులు చేపట్టేందుకు టెండర్లను పిలిచినా బిల్లులు రావనే భయంతో గుత్తేదారులు ముందుకు రాలేదు. శ్రీశైలం ప్రాజెక్టులో గ్యాలరీలో పైపులైను పనుల కోసం 40 లక్షలతో, కేబుల్ వైరు పునరుద్ధరణ, పాత పరికరాలు మార్చేందుకు మరో40 లక్షలతో టెండర్లు పిలిచినా పని కాలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిధుల్లో కోత పెట్టారు. శ్రీశైలం వంటి కీలక ప్రాజెక్టులో గ్రీజు రాసేందుకు కేవలం 4 లక్షలతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లినా మంజూరుకు ఏడాది సమయం పట్టిందంటే ఎంత దారుణ పరిస్థితులున్నాయో అర్థం చేసుకోవచ్చు.

'శ్రీశైలం డ్యాం భద్రతకు పొంచి ఉన్న ముప్పు'.. కమిటీ తుది నివేదికలో వెల్లడి

CM Jagan Negligence on Srisailam Dam: శ్రీశైలం డ్యామ్ భద్రతపై నాడు తెగ బాధపడిపోయావ్.. నేడు సీఎంగా ఏం చేస్తున్నావ్..?

CM Jagan Negligence on Srisailam Dam: 2017 జనవరి 6న ప్రతిపక్షనేత హోదాలో శ్రీశైలం డ్యామ్‌ను సందర్శించినప్పుడు.. డ్యామ్ భద్రతపై జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నిజంగా ప్రాజెక్టు భద్రతపై ఇంత ఆందోళన వ్యక్తం చేశారంటే.. అధికారంలోకి రాగానే తప్పకుండా చర్యలు తీసుకొని ఉంటారని అనుకుంటే పొరపాటే. రాయలసీమ ముద్దుబిడ్డ అని చెప్పుకునే జగన్‌.. అధికారంలో కొచ్చి నాలుగేళ్లయినా మీకు శ్రీశైలం భద్రతపై చీమ కుట్టినట్లయినా లేదా? ప్లంజ్‌ పూల్‌ అలాగే కొనసాగితే డ్యాం దెబ్బతినే ప్రమాదం ఉందని మీరే గోల పెట్టారే! మరి మీ ప్రభుత్వ హయాంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెబుతారా? సాగునీటి ప్రాజెక్టులు, వరద జలాలు అంటూ ఎన్నో కథలు చెప్తుంటారు కదా.. శ్రీశైలం ప్రాజెక్టుకు కనీస నిర్వహణ ఖర్చులు సైతం ఎందుకు ఇవ్వడం లేదు? అవసరమైన సిబ్బందిని ఎందుకు నియమించడం లేదు? డ్యాం భద్రత కమిటీ అధ్యయనం చేయించాలని సిఫార్సు చేస్తే ఇంకా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

'శ్రీశైలం ఆనకట్ట పరిరక్షణకు పరిశోధనలు అవసరం'

శ్రీశైలం ప్రాజెక్టులో ప్లంజ్‌పూల్‌ సుదీర్ఘ కాల సమస్య. స్పిల్ వే నుంచి నీరు అతి వేగంగా కిందకు ప్రవహించే క్రమంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. నీటి ఉద్ధృతి కారణంగా లోతు పెరగడం వలన ప్రస్తుతం 100 మీటర్లకు పైగానే ఉన్నట్టు అంచనా. ఇది స్పిల్ వే వైపు కూడా విస్తరిస్తోంది. దీనివల్ల శ్రీశైలం డ్యామ్ ప్రమాదం అంచున ఉందని జలవనరులశాఖ అధికారులే అంగీకరిస్తున్నారు. ఈ ప్లంజ్‌పూల్‌ పూడ్చేందుకు, కాంక్రీటు వేసేందుకు ఎప్పుడో 725 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించారు.

కాంక్రీటుతో పూడ్చటం వల్ల సమస్య పరిష్కారం కాదని, దీనిపై అత్యవసరంగా సమగ్ర అధ్యయనం చేయాలని.. కేంద్ర జలసంఘం విశ్రాంత ఛైర్మన్ ఎ. బి. పాండ్యా అధ్యక్షతన ఏర్పడిన కమిటీ తేల్చి చెప్పింది. డ్యాం భద్రతపై ఈ కమిటీ 2020వ సంవత్సరం నుంచి అధ్యయనం చేసి.. 2021లో నివేదికను సమర్పించింది. ఆ తర్వాత 2022లో మరోసారి సిఫార్సులు చేసింది. ఈ అధ్యయనానికి 15 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. నమూనా, జియోలాజికల్ అధ్యయనాలు, పియర్స్ సామర్థ్యంపై విశ్లేషణ, డ్యాం అండర్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఇలా వివిధ అంశాలకు సంబంధించి న్యూమరికల్ ఎనాలసిస్ చేయాల్సి ఉంది.

srisailam dam : శ్రీశైలం ప్లంజ్ పూల్ పనులకు ఉత్త చేయేనా..?

శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన సిబ్బంది కనీస స్థాయిలో కూడా లేరు. ఇక్కడ పని చేయడమంటే పనిష్​మెంట్​గా భావిస్తూ ఎవరూ రావటం లేదు. ఒకవేళ వచ్చినా.. స్థానికంగా నివాసం ఉండరు. మొత్తం 22 మంది జూనియర్ ఇంజినీర్లకుగాను కేవలం 6 మంది మాత్రమే ఉన్నారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు 10 మందికిగాను ఒక్కరే ఉన్నారు. ఈ డ్యాం నిర్వహణ చూడటానికే సిబ్బంది సరిపోరని, అధ్యయన ప్రతిపాదనలు సిద్ధం చేయడానికీ సాధ్యం కాని పరిస్థితులున్నాయని.. ఉన్నతాధికారులే అంగీకరిస్తున్నారు. మరోపక్క వైసీపీ ప్రభుత్వం డ్యామ్‌ను పక్కన పెట్టేసింది.

ప్లంజ్ పూల్ వల్ల ఏప్రాన్ కూడా ధ్వంసమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తన నిధులతో ఈ పనులు చేపట్టవచ్చు. డ్రిప్ కింద ప్రతిపాదనలను పంపించినా ఇప్పటికీ వాటికి నిధులను మంజూరు చేయలేదు. గతంలో శ్రీశైలం ప్రాజెక్టులో చిన్న చిన్న పనులు చేపట్టేందుకు టెండర్లను పిలిచినా బిల్లులు రావనే భయంతో గుత్తేదారులు ముందుకు రాలేదు. శ్రీశైలం ప్రాజెక్టులో గ్యాలరీలో పైపులైను పనుల కోసం 40 లక్షలతో, కేబుల్ వైరు పునరుద్ధరణ, పాత పరికరాలు మార్చేందుకు మరో40 లక్షలతో టెండర్లు పిలిచినా పని కాలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిధుల్లో కోత పెట్టారు. శ్రీశైలం వంటి కీలక ప్రాజెక్టులో గ్రీజు రాసేందుకు కేవలం 4 లక్షలతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లినా మంజూరుకు ఏడాది సమయం పట్టిందంటే ఎంత దారుణ పరిస్థితులున్నాయో అర్థం చేసుకోవచ్చు.

'శ్రీశైలం డ్యాం భద్రతకు పొంచి ఉన్న ముప్పు'.. కమిటీ తుది నివేదికలో వెల్లడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.