ETV Bharat / state

కర్నూలులో ప్రబలిన అతిసారం.. నలుగురు మృతి.. 40మందికి అస్వస్థత

author img

By

Published : Apr 7, 2021, 10:13 AM IST

Updated : Apr 7, 2021, 12:39 PM IST

అతిసారం కర్నూలు జిల్లా గోరుకల్లు వాసులను ఇబ్బంది పెడుతోంది. గత రెండు రోజులుగా గ్రామంలో అతిసారంతో అనేకమంది అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటివరకూ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 40 మంది అస్వస్థతకు గురయ్యారు. 60 మందికిపైగా చికిత్స పొందుతున్నారు.

water problem
water problem
కర్నూలులో ప్రబలిన అతిసారం.. నలుగురు మృతి.. 40మందికి అస్వస్థత

కర్నూలు జిల్లాలో అతిసారం ఆందోళన కలిగిస్తోంది. పాణ్యం మండలం గోరుకల్లు గ్రామంలో రెండ్రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి చెందారు. ఆదోని పట్టణంలోని అరుణ జ్యోతినగర్​లో సుమారు 40 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చికిత్సపొందుతూ రంగమ్మ అనే వృద్ధురాలు మరణించారు. బాధితులను ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

కలుషిత నీటివల్లే వాంతులు, విరేచనాలు అవుతున్నాయని.. బాధితులు ఆరోపిస్తున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని.. వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ వీరపాండియన్ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు జిల్లాలో అతిసారంతో.. నలుగురు మరణించారు. 60 మందికిపైగా చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి: గోరకల్లులో అతిసారంతో ఇద్దరు మృతి

కర్నూలులో ప్రబలిన అతిసారం.. నలుగురు మృతి.. 40మందికి అస్వస్థత

కర్నూలు జిల్లాలో అతిసారం ఆందోళన కలిగిస్తోంది. పాణ్యం మండలం గోరుకల్లు గ్రామంలో రెండ్రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి చెందారు. ఆదోని పట్టణంలోని అరుణ జ్యోతినగర్​లో సుమారు 40 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చికిత్సపొందుతూ రంగమ్మ అనే వృద్ధురాలు మరణించారు. బాధితులను ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

కలుషిత నీటివల్లే వాంతులు, విరేచనాలు అవుతున్నాయని.. బాధితులు ఆరోపిస్తున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని.. వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ వీరపాండియన్ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు జిల్లాలో అతిసారంతో.. నలుగురు మరణించారు. 60 మందికిపైగా చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి: గోరకల్లులో అతిసారంతో ఇద్దరు మృతి

Last Updated : Apr 7, 2021, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.