కర్నూలు జిల్లా గొందిపర్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పూజల పేరుతో ఓ మహిళ ధరించిన బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. గొల్ల లక్ష్మీదేవి అనే మహిళ స్థానికంగా కిరాణ దుకాణం నిర్వహిస్తోంది. ఇద్దరు వ్యక్తులు వచ్చి తాము చెప్పినట్లు పూజ చేస్తే ఆర్థికంగా బాగుంటుందని నమ్మబలికారు. దేవుని పటం వద్ద తమలపాకులు ఉంచి మెడలో ఉన్న బంగారు గొలుసును వాటిలో పెట్టాలని చెప్పారు. వారి మాటలు నమ్మిన లక్ష్మీదేవి అలానే చేసింది. అనంతరం ఆమె కళ్లు గప్పి గొలుసు తీసుకుని పరారయ్యారు. గమనించిన బాధితురాలు కుటుంబసభ్యులకు తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించి... నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి: