ETV Bharat / state

ఆలూరులో వైభవంగా శివరాత్రి

author img

By

Published : Mar 11, 2021, 1:44 PM IST

Updated : Mar 11, 2021, 5:20 PM IST

ఆలూరు పట్టణ కేంద్రంలో భీమలింగేశ్వర స్వామి ఆలయానికి.. భక్తులు పోటెత్తారు. వేకువజామునుంచే స్వామికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకం, మంగళ హారతి పూజలు నిర్వహించారు.

temple is enchanted with the remembrance of Lord Shiva
శివనామ స్మరణతో మారుమ్రోగిన ఆలయం

కర్నూలు జిల్లా ఆలూరు పట్టణ కేంద్రంలో వెలసిన భీమలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి స్వామికి ప్రత్యేక పూజలు పంచామృతాభిషేకం, బిల్వార్చన, మహా మంగళ హారతి పూజలు చేశారు. ఆలయం శివనామస్మరణతో మారుమ్రోగింది. ఈ అర్ధరాత్రి శివపార్వతులకు కల్యాణం జరుగుతుంది. దేవరగట్టులో కొలువైన మాళ మల్లేశ్వరస్వామి దేవాలయంలో భక్తులు పోటెత్తారు.

శివరాత్రి పర్వదినం సందర్భంగా కర్నూలు నగరంలోని శివాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తి శ్రద్ధలతో శివపార్వతులను దర్శించుకుంటున్నారు.

కర్నూలు జిల్లా ఆలూరు పట్టణ కేంద్రంలో వెలసిన భీమలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి స్వామికి ప్రత్యేక పూజలు పంచామృతాభిషేకం, బిల్వార్చన, మహా మంగళ హారతి పూజలు చేశారు. ఆలయం శివనామస్మరణతో మారుమ్రోగింది. ఈ అర్ధరాత్రి శివపార్వతులకు కల్యాణం జరుగుతుంది. దేవరగట్టులో కొలువైన మాళ మల్లేశ్వరస్వామి దేవాలయంలో భక్తులు పోటెత్తారు.

శివరాత్రి పర్వదినం సందర్భంగా కర్నూలు నగరంలోని శివాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తి శ్రద్ధలతో శివపార్వతులను దర్శించుకుంటున్నారు.

ఇదీ చదవండి:

శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనానికి వెల్లువెత్తిన భక్తజనం

Last Updated : Mar 11, 2021, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.