ETV Bharat / state

సాంకేతిక సమస్యల పేరుతో.. ఆటో మ్యూటేషన్‌ పరేషాన్‌

భూమి కొనుగోలు చేసిన రైతులు, వ్యాపారులు వారి భూములను రెవెన్యూ రికార్డుల్లో ఎక్కించుకోవాలంటే అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిందే. రెవెన్యూ సిబ్బందికి మామూళ్లు ఇచ్చుకునే పరిస్థితులకు స్వస్తి పలికి, నేరుగా భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారి వివరాలు రెవెన్యూ అధికారులకు వెళ్లేలా వారు రికార్డుల్లోకి ఎక్కించేందుకు ప్రభుత్వం ఆటో మ్యూటేషన్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై ఇటు రిజిస్ట్రేషన్‌ అధికారులు, రెవెన్యూ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆరు నెలల క్రితమే ఈ విధానం పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చినా కర్నూలు జిల్లాలో క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. ప్రభుత్వం పారదర్శక విధానాలు తీసుకొస్తున్నా అధికారులు మాత్రం ఇతర సమస్యల బూచి చూపి మళ్లీ రైతులను కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిప్పుతూనే ఉన్నారు.

author img

By

Published : Nov 1, 2020, 6:10 PM IST

technical issues in auto mutation kurnool  dist
ఆటో మ్యూటేషన్‌ పరేషాన్‌

కర్నూలు జిల్లాలో 24 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలున్నాయి. వీటిలో నంద్యాల పరిధిలో ప్రతిరోజు 150 నుంచి 250 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఇందులో నంద్యాల, ఆళ్లగడ్డ పరిధిలో వ్యవసాయేతర భూములు 60 శాతం జరుగుతుండగా 40 శాతం వ్యవసాయ భూములు రిజిస్టర్‌ అవుతుంటాయి. మిగతా వాటిలో వ్యవసాయ రిజిస్ట్రేషన్లు 80 శాతం 20 శాతం వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. కర్నూలు డివిజన్‌ పరిధిలోని 14 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ప్రతిరోజు 250 నుంచి 330 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఇలా ఈ రిజిస్ట్రేషన్లు జరిగిన వెంటనే రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి తహసీల్దారు లాగిన్‌కు, అక్కడి నుంచి వీఆర్వో లాగిన్‌కు ఆ భూముల వివరాలు వెళ్తాయి. వారు వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయంటే ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయటంతో పాటు వారికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇలాంటి పరిస్థితి కనిపించటం లేదు. రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి తమకు రాలేదని, ఎక్కడో టెక్నికల్‌ సమస్య ఉందంటూ రైతులను, కొనుగోలు చేసిన వారిని రెవెన్యూ అధికారులు తిప్పుకొంటూనే ఉన్నారు. నెలలు గడుస్తున్నా తిరగలేక వారు మ్యానువల్‌గా మళ్లీ మీసేవా కేంద్రాలకు వెళ్లి మ్యూటేషన్‌కు కట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాపోతున్నారు. ఓవైపు రిజిస్ట్రార్‌ అధికారులు మాత్రం తాము రిజిస్ట్రేషన్‌ చేసిన ప్రతి దరఖాస్తును ఆటో మ్యూటేషన్‌లో రెవెన్యూ వారికి పంపుతున్నామని చెబుతున్నారు.

ఆశలు ఆవిరి

వెల్దుర్తి మండలం నార్లాపురానికి చెందిన సుభాషిణి అనే మహిళ 146-1 సర్వే నంబరులో 1.75 ఎకరాల భూమిని కొనుగోలు చేసి నాలుగు నెలల క్రితం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఇక పని అయిపోయింది, ఆటో మ్యూటేషన్‌ ద్వారా రెవెన్యూ రికార్డుల్లో తన వివరాలు నమోదు చేస్తారని, కొత్త పట్టాదారు పాసుపుస్తకం వస్తుందని ఆమె ఆశపడ్డారు. రెవెన్యూ అధికారులను అడిగితే ఫారం-8లో కూడా వివరాలు నమోదు చేశామని, కానీ టెక్నికల్‌ సమస్యతో తిరస్కరణకు గురైందని చెప్పారని ఆమె వాపోయారు. దీంతో మ్యానువల్‌గా మళ్లీ మీసేవా కేంద్రంలో మ్యూటేషన్‌కు డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా డోన్‌, వెల్దుర్తితో పాటు పలు ప్రాంతాల్లోనూ వేలాది సమస్యలున్నాయి. రామళ్లకోట ప్రాంతంలో ఎంతో మంది ఇలా ఇబ్బందులకు గురవుతున్నామని వాపోతున్నారు. .

మాముళ్లు ఇచ్చుకోలేక..

●వెల్దుర్తి మండలం సూదేపల్లె పరిధిలోని పొలం అంతర్జాలంలో ఉన్న రైతు ఈ పాస్‌ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. రెవెన్యూ సిబ్బంది పట్టించుకోకపోవటంతో తిరస్కరణకు గురైంది. దీంతో వెల్దుర్తికి చెందిన సంజన్నగౌడ్‌ అనే రైతు వీఆర్వోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరస్కరణ ఎందుకు గురైందని ప్రశ్నించారు. దీంతో కార్యాలయంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇలా ఈయనదే కాదు వెల్దుర్తి తహసీల్దారు కార్యాలయంలో ఎంతో మంది రైతుల పరిస్థితి ఇలానే ఉంది. ఇటు ఉన్నతాధికారులకు చెప్పుకోలేక, అటు రెవెన్యూ సిబ్బందికి మామూళ్లు ఇచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. తహసీల్దారు కార్యాలయానికి చేరిన పాసు పుస్తకాలను వారికి ఇచ్చేందుకూ సిబ్బంది రూ.వేయి నుంచి 2 వేలు వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

సమస్యల బూచి..చేయి తడపక తప్పదు మరి

ఆటో మ్యూటేషన్‌ కావాల్సి ఉన్నా క్షేత్రస్థాయిలో కొందరు రెవెన్యూ సిబ్బంది సమస్యల బూచి చూపి సాంకేతిక సమస్యలతో రిజెక్ట్‌ అవుతున్నాయని చూపుతున్నారు. కానీ మ్యాన్‌వల్‌గా కట్టిస్తే అలాంటి రైతులు తిరిగి తమ వద్దకే రాక తప్పదని, వారు చేయి తడపక తప్పదనే ఉద్దేశంతోనే క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇదీ చదవండి:

మద్ధతు ధర దక్కక వేరుశనగ రైతు విలవిల

కర్నూలు జిల్లాలో 24 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలున్నాయి. వీటిలో నంద్యాల పరిధిలో ప్రతిరోజు 150 నుంచి 250 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఇందులో నంద్యాల, ఆళ్లగడ్డ పరిధిలో వ్యవసాయేతర భూములు 60 శాతం జరుగుతుండగా 40 శాతం వ్యవసాయ భూములు రిజిస్టర్‌ అవుతుంటాయి. మిగతా వాటిలో వ్యవసాయ రిజిస్ట్రేషన్లు 80 శాతం 20 శాతం వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. కర్నూలు డివిజన్‌ పరిధిలోని 14 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ప్రతిరోజు 250 నుంచి 330 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఇలా ఈ రిజిస్ట్రేషన్లు జరిగిన వెంటనే రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి తహసీల్దారు లాగిన్‌కు, అక్కడి నుంచి వీఆర్వో లాగిన్‌కు ఆ భూముల వివరాలు వెళ్తాయి. వారు వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయంటే ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయటంతో పాటు వారికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇలాంటి పరిస్థితి కనిపించటం లేదు. రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి తమకు రాలేదని, ఎక్కడో టెక్నికల్‌ సమస్య ఉందంటూ రైతులను, కొనుగోలు చేసిన వారిని రెవెన్యూ అధికారులు తిప్పుకొంటూనే ఉన్నారు. నెలలు గడుస్తున్నా తిరగలేక వారు మ్యానువల్‌గా మళ్లీ మీసేవా కేంద్రాలకు వెళ్లి మ్యూటేషన్‌కు కట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాపోతున్నారు. ఓవైపు రిజిస్ట్రార్‌ అధికారులు మాత్రం తాము రిజిస్ట్రేషన్‌ చేసిన ప్రతి దరఖాస్తును ఆటో మ్యూటేషన్‌లో రెవెన్యూ వారికి పంపుతున్నామని చెబుతున్నారు.

ఆశలు ఆవిరి

వెల్దుర్తి మండలం నార్లాపురానికి చెందిన సుభాషిణి అనే మహిళ 146-1 సర్వే నంబరులో 1.75 ఎకరాల భూమిని కొనుగోలు చేసి నాలుగు నెలల క్రితం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఇక పని అయిపోయింది, ఆటో మ్యూటేషన్‌ ద్వారా రెవెన్యూ రికార్డుల్లో తన వివరాలు నమోదు చేస్తారని, కొత్త పట్టాదారు పాసుపుస్తకం వస్తుందని ఆమె ఆశపడ్డారు. రెవెన్యూ అధికారులను అడిగితే ఫారం-8లో కూడా వివరాలు నమోదు చేశామని, కానీ టెక్నికల్‌ సమస్యతో తిరస్కరణకు గురైందని చెప్పారని ఆమె వాపోయారు. దీంతో మ్యానువల్‌గా మళ్లీ మీసేవా కేంద్రంలో మ్యూటేషన్‌కు డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా డోన్‌, వెల్దుర్తితో పాటు పలు ప్రాంతాల్లోనూ వేలాది సమస్యలున్నాయి. రామళ్లకోట ప్రాంతంలో ఎంతో మంది ఇలా ఇబ్బందులకు గురవుతున్నామని వాపోతున్నారు. .

మాముళ్లు ఇచ్చుకోలేక..

●వెల్దుర్తి మండలం సూదేపల్లె పరిధిలోని పొలం అంతర్జాలంలో ఉన్న రైతు ఈ పాస్‌ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. రెవెన్యూ సిబ్బంది పట్టించుకోకపోవటంతో తిరస్కరణకు గురైంది. దీంతో వెల్దుర్తికి చెందిన సంజన్నగౌడ్‌ అనే రైతు వీఆర్వోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరస్కరణ ఎందుకు గురైందని ప్రశ్నించారు. దీంతో కార్యాలయంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇలా ఈయనదే కాదు వెల్దుర్తి తహసీల్దారు కార్యాలయంలో ఎంతో మంది రైతుల పరిస్థితి ఇలానే ఉంది. ఇటు ఉన్నతాధికారులకు చెప్పుకోలేక, అటు రెవెన్యూ సిబ్బందికి మామూళ్లు ఇచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. తహసీల్దారు కార్యాలయానికి చేరిన పాసు పుస్తకాలను వారికి ఇచ్చేందుకూ సిబ్బంది రూ.వేయి నుంచి 2 వేలు వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

సమస్యల బూచి..చేయి తడపక తప్పదు మరి

ఆటో మ్యూటేషన్‌ కావాల్సి ఉన్నా క్షేత్రస్థాయిలో కొందరు రెవెన్యూ సిబ్బంది సమస్యల బూచి చూపి సాంకేతిక సమస్యలతో రిజెక్ట్‌ అవుతున్నాయని చూపుతున్నారు. కానీ మ్యాన్‌వల్‌గా కట్టిస్తే అలాంటి రైతులు తిరిగి తమ వద్దకే రాక తప్పదని, వారు చేయి తడపక తప్పదనే ఉద్దేశంతోనే క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇదీ చదవండి:

మద్ధతు ధర దక్కక వేరుశనగ రైతు విలవిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.