పంచాయతీ ఎన్నికల్లో తెదేపా మద్దతుదారులను గెలవనీయకుండా వైకాపా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెదేపా నేత కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. పోలీసులతో ఓటర్లను బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారని అన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా.. గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని తప్పించుకునేందుకు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆక్షేపించారు.
ఇదీ చదవండి:
కుప్పంలో ప్రజాస్వామ్యం ఓడింది.. ఉన్మాదం గెలిచింది: చంద్రబాబు