ETV Bharat / state

కనిపించకుండా పోయాడు.. కాలువలో విగతజీవిగా తేలాడు! - బనగానపల్లె ప్రభుత్వ కళాశాల తాజా వార్తలు

అనుమానాస్పద స్థితిలో కాలువలో పడి ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం వెంకటాపురం గ్రామంలో జరిగింది. బనగానపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న అరవింద్.. ఎస్ఆర్బీసీ ప్రధాన కాలువలో శుక్రవారం శవమై తేలాడు.

student missing found dead
కాలువలో పడి ఓ విద్యార్థి మృతి
author img

By

Published : Jan 30, 2021, 7:24 AM IST

కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన అరవింద్ (18) అనే విద్యార్థి ఎస్ఆర్బీసీ కాలువలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బనగానపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న అరవింద్.. గురువారం కళాశాల నుంచి ఇంటికి వచ్చి బయటికి వెళ్లిపోయాడు.

అనంతరం కనిపించకుండా పోయిన అరవింద్..​ ఎస్ఆర్బీసీ ప్రధాన కాలువలో శుక్రవారం శవమై కనిపించాడు. తమకు ఎలాంటి సమస్యలు లేవని తన కుమారుడు అరవింద్​ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని తండ్రి బాలస్వామి వెల్లడించారు, కేసు నమోదు చేసుకున్న బనగానపల్లె పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన అరవింద్ (18) అనే విద్యార్థి ఎస్ఆర్బీసీ కాలువలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బనగానపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న అరవింద్.. గురువారం కళాశాల నుంచి ఇంటికి వచ్చి బయటికి వెళ్లిపోయాడు.

అనంతరం కనిపించకుండా పోయిన అరవింద్..​ ఎస్ఆర్బీసీ ప్రధాన కాలువలో శుక్రవారం శవమై కనిపించాడు. తమకు ఎలాంటి సమస్యలు లేవని తన కుమారుడు అరవింద్​ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని తండ్రి బాలస్వామి వెల్లడించారు, కేసు నమోదు చేసుకున్న బనగానపల్లె పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

రసాయన మిశ్రమం తాగిన పీజీ విద్యార్థి.. పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.