
కర్నూలు జిల్లా నంద్యాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్కే రహదారిపై లారీ బైక్ను ఢీకొని ఒకరు మృతి చెందారు. ముందుగా వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోతూ టైర్ కింద పడి నంద్యాల పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 15 ఏళ్ల శ్రీహర్ష చనిపోయాడు. శిల్పానగర్కు చెందిన రాజు గౌడ్ అనే యువకుడికి గాయాలయ్యాయి. వీరిద్దరు కలిసి బైక్పై వెళ్తుండగా ముందు వెళ్ళే లారీని దాటే ప్రయత్నం చేయటంతో ఈ ఘటన జరిగింది. నంద్యాల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి