ETV Bharat / state

ఓర్వకల్లులో ఏడుగురు దొంగలు అరెస్ట్.. రూ.5 లక్షలు స్వాధీనం

మే 28న కర్నూలు జిల్లా నంద్యాల వద్ద జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 5 లక్షల నగదు, స్కార్పియో వాహనం, ఏడు సెల్ ఫోన్లును స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Jul 1, 2021, 7:56 AM IST

police arrested seven thiefs at orvakallu
ఓర్వకల్లులో ఏడుగురు దొంగలు అరెస్ట్

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏడుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. మే 28న రాత్రి తడకనపల్లె వైపు నుంచి నంద్యాల వెళుతున్న ఖాళీ పత్తిలారీని ఆపి.. డ్రైవర్ పాపారాయుడి వద్దనున్న నగదును ఆ దొంగలు ఎత్తుకెళ్లారు. డ్రైవర్​ను ప్లాస్టర్ టేపుతో కట్టేసి అతని వద్ద ఉన్న పత్తిలోడు డబ్బులు రూ. 5,63,900/- సెల్ ఫోన్​ను దోచేశారు.

అక్కడినుంచి స్కార్పియో వాహనంలో పరారయ్యారు. ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు.. పూడిచెర్లమెట్ట వద్ద నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 5 లక్షల నగదు, స్కార్పియో వాహనం, ఏడుగురికి చెందిన సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కర్నూలు డీఎస్పీమహేష్ తెలిపారు.

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏడుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. మే 28న రాత్రి తడకనపల్లె వైపు నుంచి నంద్యాల వెళుతున్న ఖాళీ పత్తిలారీని ఆపి.. డ్రైవర్ పాపారాయుడి వద్దనున్న నగదును ఆ దొంగలు ఎత్తుకెళ్లారు. డ్రైవర్​ను ప్లాస్టర్ టేపుతో కట్టేసి అతని వద్ద ఉన్న పత్తిలోడు డబ్బులు రూ. 5,63,900/- సెల్ ఫోన్​ను దోచేశారు.

అక్కడినుంచి స్కార్పియో వాహనంలో పరారయ్యారు. ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు.. పూడిచెర్లమెట్ట వద్ద నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 5 లక్షల నగదు, స్కార్పియో వాహనం, ఏడుగురికి చెందిన సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కర్నూలు డీఎస్పీమహేష్ తెలిపారు.

ఇదీ చూడండి:

దర్భంగా పేలుడు ఘటనలో ఇద్దరు హైదరాబాదీలు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.