ETV Bharat / state

కొండల్లో శవమై కనిపించిన వివాహిత.... భర్తపై అనుమానం! - కర్నూలు జిల్లా క్రైమ్ వార్తలు

భార్య పుట్టింటికి ఫోన్ చేసి ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. తర్వాత మళ్లీ ఫోన్ చేసి ఇంట్లో తన భార్య కనిపించడం లేదన్నాడు. తీరా చూస్తే కొండ గుట్టల్లో భార్య శవమై కనిపించింది. ఆ భర్త పరారీలో ఉన్నాడు. ఈ అనుమానాస్పద ఘటన కర్నూలు జిల్లా అలేబాద్ తండాలో జరిగింది.

married woman dead in pyaapili mandal kurnool district
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
author img

By

Published : Jun 15, 2020, 4:43 PM IST

కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం అలేబాద్ తండాలో ఒక వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్తే చంపినట్లు ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన రవినాయక్​, బేతంచెర్ల మండలం గొరుమానుకొండ గ్రామానికి చెందిన సుశీల బాయ్​ భార్యాభర్తలు. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు బంధువులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం సుశీల పుట్టింటికి రవి నాయక్ ఫోన్ చేసి.. భార్యను తీసుకొస్తున్నట్లు చెప్పాడు. మరలా అదే రోజు సాయంత్రం ఫోన్ చేసి ఇంట్లో తన భార్య కనిపించడం లేదని సుశీల తల్లిదండ్రులకు చెప్పాడు. సోమవారం ఉదయం గ్రామ సమీపంలోని కొండల్లో సుశీల శవమై కనిపించింది. విచారణ చేపట్టిన పోలీసులు.. రవినాయక్ సుశీలను చంపి పరారైనట్లు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు.

కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం అలేబాద్ తండాలో ఒక వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్తే చంపినట్లు ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన రవినాయక్​, బేతంచెర్ల మండలం గొరుమానుకొండ గ్రామానికి చెందిన సుశీల బాయ్​ భార్యాభర్తలు. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు బంధువులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం సుశీల పుట్టింటికి రవి నాయక్ ఫోన్ చేసి.. భార్యను తీసుకొస్తున్నట్లు చెప్పాడు. మరలా అదే రోజు సాయంత్రం ఫోన్ చేసి ఇంట్లో తన భార్య కనిపించడం లేదని సుశీల తల్లిదండ్రులకు చెప్పాడు. సోమవారం ఉదయం గ్రామ సమీపంలోని కొండల్లో సుశీల శవమై కనిపించింది. విచారణ చేపట్టిన పోలీసులు.. రవినాయక్ సుశీలను చంపి పరారైనట్లు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు.

ఇవీ చదవండి..: తలనీలాలు.. ఇక్కడ తీస్తారు.. అక్కడ వేస్తారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.