కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టులను.. కేఆర్ఎమ్బీ(Krishna River Management Board, krmb) బృందం సందర్శించింది. రాష్ట్రంలో నిర్మించిన మల్యాల హంద్రీనీవా సుజల స్రవంతి, ముచ్చుమర్రి హంద్రీనీవా సుజల స్రవంతి, కేసీ కెనాల్ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్టులను.. కృష్ణా బోర్డు ఆధ్వర్యంలో తీసుకోవాలని తెలంగాణ రాష్ట్రం కోరింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో పర్యటించిన బృందం.. స్థానిక అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: TOMATO PRICE HIKE: అక్కడ వర్షాలు ఎక్కువైనందుకే.. టమాటా ధర పైపైకి!