ETV Bharat / state

ఎస్​ఈబీ దాడుల్లో కర్ణాటక మద్యం స్వాధీనం

author img

By

Published : Jun 14, 2021, 10:31 AM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని కోటేకల్​ వద్ద కర్ణాటక మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్​ఈబీ సీఐ తెలిపారు.

liquor seized
పోలీసుల అదుపులో నిందితులు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని కోటేకల్ వద్ద ఎస్​ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 11 బాక్సుల బీర్లు, 14 బాక్సుల్లో కర్ణాటక నుంచి తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రెండు ద్విచక్రవాహనాలను సీజ్​ చేశామని చెప్పారు.

కర్ణాటకలో తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి, రాష్ట్రంలోని పలు గ్రామాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని సెబ్​ సీఐ మహేశ్​ కుమార్​ తెలిపారు. గోనెగండ్ల మండలం బైలుప్పులకు చెందిన నలుగురిపై కేసు నమోదు చేశామన్నారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని కోటేకల్ వద్ద ఎస్​ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 11 బాక్సుల బీర్లు, 14 బాక్సుల్లో కర్ణాటక నుంచి తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రెండు ద్విచక్రవాహనాలను సీజ్​ చేశామని చెప్పారు.

కర్ణాటకలో తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి, రాష్ట్రంలోని పలు గ్రామాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని సెబ్​ సీఐ మహేశ్​ కుమార్​ తెలిపారు. గోనెగండ్ల మండలం బైలుప్పులకు చెందిన నలుగురిపై కేసు నమోదు చేశామన్నారు.

ఇదీ చదవండి:

liquor seized: 2,304 మద్యం పాకెట్లు స్వాధీనం... ఆరుగురు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.