కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా... ఓ తల్లి 10 రోజులపాటు నరకం చూసింది. పార్లపల్లెకు చెందిన అంజలి అనే గర్భిణీ... నవంబరు 5న ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు సాధారణ కాన్పు జరిగింది. చిన్న శస్త్ర చికిత్స చేసి... రక్తస్రావం కాకుండా కాటన్ ప్యాడ్లు పెట్టారు. సిబ్బంది ఆ విషయం మరచి... ప్యాడ్లను అలానే ఉంచి కుట్లు వేశారు. అనంతరం అమెను డిశ్చార్జ్ చేశారు. 10 రోజులు గడిచిన బాలింతకు నొప్పి తగ్గలేదు. కుటుంబ సభ్యులు మళ్లీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు పరీక్షించగా... అసలు విషయం బయటపడింది. వెంటనే శస్త్రచికిత్స చేసి... కాటన్ ప్యాడ్లను తీసేశారు.
ఇదీ చదవండి :