జాతీయ రహదారులపై దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కంజారా ముఠా పేరుతో... రహదారులపై వెళ్తున్న భారీ లోడు వాహనాలను వెంబడించి... వస్తువులను దోచుకుంటున్న ముఠాను కర్నూలు పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి... మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఫకీరప్ప వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి 85 ఫోన్లు... 16 చీరలు, ఒక బాక్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నేరాలకు ఉపయోగించిన 2 లారీలు, 2 పిడి బాకులు, ఒక ఐరన్ కట్టర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై దేశంలోని పలు రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్లు ఎస్పీ వివరించారు.
ఇదీ చూడండి: అనంతపురంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు