రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ... రైతులకు వైకాపా అన్యాయం చేస్తోందని గౌరు చరితా రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. అధిక వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు ఇబ్బందులు పడుతుంటే వైకాపా ఎమ్మెల్యేలు ఒక్కరైనా పంటలను పరిశీలించారా? అని ప్రశ్నించారు. పంట నష్ట పరిహారం పంట వేయని వారికి ఇచ్చి అసలైన రైతులకు అన్యాయం చేశారని గౌరు చరితా ఆరోపించారు.
ఇదీ చదవండి: 'ఎమ్మెల్యే శ్రీదేవి వల్ల ప్రాణహాని ఉంది.... బోరుమన్న వైకాపా బహిష్కృత నేత'