ETV Bharat / state

ప్రభుత్వ అలసత్వమే.. రాజోలికి 'గుది'బండ.. వెలవెలబోతున్న 40వేల ఎకరాల ఆయకట్టు

author img

By

Published : Feb 16, 2023, 9:20 AM IST

RAJOLI BANDA DAM : కర్నూలు జిల్లాలో మూడు నియోజకవర్గాలకు సాగు, తాగునీటిని అందించే రాజోలిబండ మళ్లింపు పథకంపై.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. నాలుగు టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నా.. ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిధులు కేటాయించక, భూసేకరణను పట్టించుకోక పోవడంతో.. ఆర్డీఎస్​ పథకం అందుబాటులోకి రాక 40 వేల ఎకరాకల ఆయకట్టు వెల వెలబోతోంది.

RAJOLI BANDA DAM
RAJOLI BANDA DAM
ప్రభుత్వ అలసత్వమే.. రాజోలికి 'గుది'బండ.. వెలవెలబోతున్న 40వేల ఎకరాల ఆయకట్టు

RAJOLI BANDA DAM : మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న రాజోలి బండ డైవర్షన్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. పొరుగు రాష్ట్రాలు తెలంగాణా, కర్ణాటకలు నిరంతరాయంగా నీటిని వినియోగించుకుంటుంటే.. ఆంధ్రప్రదేశ్​ మాత్రం అవేమీ పట్టనట్టు మొద్దు నిద్ర నటిస్తోంది. తుంగభద్ర డ్యామ్ నుంచి దిగువన నాలుగు టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. దీంతో కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాలకు తాగు, సాగునీరు అందని పరిస్థితి నెలకొంది.

రాజోలిబండ నుంచి 4 టీఎంసీల నీటిని ఏపీ వినియోగించుకునే అవకాశముందంటూ కృష్ణా జలవివాదాల ట్రైబ్యునల్ అనుమతి ఇచ్చింది. ఈ నీటిని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా గత ప్రభుత్వ హయాంలో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ద్వారా కాలువల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. 1985 కోట్ల వ్యయంతో ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టు నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం టెండర్లు కూడా పిలిచింది.

కుడివైపున కాలువ నిర్మించి తుంగభద్ర నుంచి రోజుకు 21.81 క్యూసెక్స్ చొప్పున 60 రోజుల పాటు 4 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని ప్రణాళిక సిద్ధం చేశారు. తద్వారా మూడు నియోజకవర్గాల్లో 40 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలన్నది లక్ష్యం. మొత్తం 160 కిలో మీటర్ల పొడవున కాలువ నిర్మించి 4 చోట్ల రిజర్వాయర్లు నిర్మించేందుకు ప్రణాళిక చేశారు. కోసిగి, పెద్దకడబూరు, కోట్టెకల్లు, చిన్నమరివీడుల వద్ద జలాశయాలు నిర్మించేలా కార్యాచరణ చేశారు. నాలుగు ఎత్తిపోతల పథకాల ద్వారా 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం రాజోలిబండ అనకట్ట వద్ద నీటి మళ్లింపు కోసం కొంతమేర సివిల్ పనులు చేశారు. నీటిని తోడుకునేందుకు హెడ్ రెగ్యలేటర్ నిర్మాణం పూర్తి అయ్యింది.

గత ప్రభుత్వ హయాంలో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్​ను ప్రాధాన్యతా ప్రాజెక్టుగా గుర్తించినా.. ప్రస్తుతం దీని నిర్మాణంలో పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తోంది. రాజోలిబండ ఆనకట్ట నుంచి కుడివైపున 160 కిలో మీటర్ల పొడవైన ప్రధాన కాలువ నిర్మాణం కోసం 1387 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. అలాగే 4 పంప్ హౌస్​ల నిర్మాణం కోసం 167 ఎకరాలు, 4 చోట్ల రిజర్వాయర్ల నిర్మాణం కోసం 2290 ఎకరాలు, రిజర్వాయర్ల నుంచి డిస్ట్రిబ్యూటరీలను తవ్వేందుకు 2025 ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉంది. పథకం నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైతే... తమకు మెరుగైన పరిహారం ఇచ్చాకే భూసేకరణ చేయాలని రైతులు అంటున్నారు.

ప్రస్తుతం రాజోలిబండ ఆనకట్ట దిగువన కొన్ని ఎత్తిపోతల పథకాలు ఉన్నా నదిలో పారే కొద్దిపాటి నీటి కోసం రైతులు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి. తమ పొలాల్లో నీటి తడి పెట్టుకోవాలంటే లక్షలు ఖర్చు చేయాల్సిందే. ఒక్కో రైతూ 4-5 లక్షల రూపాయల వ్యయంతో పైపులైన్లు వేసుకుంటున్న దుస్థితి నెలకొంది. స్థానిక ప్రజాప్రతినిధులు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెబుతున్నా పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని ప్రాంతాలకూ నీరు వచ్చేలా డిస్ట్రిబ్యూటరీలు తవ్వాలని కూడా రైతుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తున్నాయి. రాజోలిబండ ఆనకట్ట హెడ్ రెగ్యులేటర్ సివిల్ పనులు పూర్తయినా.. ఇంకా గేట్లు అనుసంధాన పనులు చేయాల్సి ఉంది.

ఇవీ చదవండి:

ప్రభుత్వ అలసత్వమే.. రాజోలికి 'గుది'బండ.. వెలవెలబోతున్న 40వేల ఎకరాల ఆయకట్టు

RAJOLI BANDA DAM : మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న రాజోలి బండ డైవర్షన్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. పొరుగు రాష్ట్రాలు తెలంగాణా, కర్ణాటకలు నిరంతరాయంగా నీటిని వినియోగించుకుంటుంటే.. ఆంధ్రప్రదేశ్​ మాత్రం అవేమీ పట్టనట్టు మొద్దు నిద్ర నటిస్తోంది. తుంగభద్ర డ్యామ్ నుంచి దిగువన నాలుగు టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. దీంతో కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాలకు తాగు, సాగునీరు అందని పరిస్థితి నెలకొంది.

రాజోలిబండ నుంచి 4 టీఎంసీల నీటిని ఏపీ వినియోగించుకునే అవకాశముందంటూ కృష్ణా జలవివాదాల ట్రైబ్యునల్ అనుమతి ఇచ్చింది. ఈ నీటిని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా గత ప్రభుత్వ హయాంలో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ద్వారా కాలువల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. 1985 కోట్ల వ్యయంతో ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టు నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం టెండర్లు కూడా పిలిచింది.

కుడివైపున కాలువ నిర్మించి తుంగభద్ర నుంచి రోజుకు 21.81 క్యూసెక్స్ చొప్పున 60 రోజుల పాటు 4 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని ప్రణాళిక సిద్ధం చేశారు. తద్వారా మూడు నియోజకవర్గాల్లో 40 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలన్నది లక్ష్యం. మొత్తం 160 కిలో మీటర్ల పొడవున కాలువ నిర్మించి 4 చోట్ల రిజర్వాయర్లు నిర్మించేందుకు ప్రణాళిక చేశారు. కోసిగి, పెద్దకడబూరు, కోట్టెకల్లు, చిన్నమరివీడుల వద్ద జలాశయాలు నిర్మించేలా కార్యాచరణ చేశారు. నాలుగు ఎత్తిపోతల పథకాల ద్వారా 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం రాజోలిబండ అనకట్ట వద్ద నీటి మళ్లింపు కోసం కొంతమేర సివిల్ పనులు చేశారు. నీటిని తోడుకునేందుకు హెడ్ రెగ్యలేటర్ నిర్మాణం పూర్తి అయ్యింది.

గత ప్రభుత్వ హయాంలో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్​ను ప్రాధాన్యతా ప్రాజెక్టుగా గుర్తించినా.. ప్రస్తుతం దీని నిర్మాణంలో పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తోంది. రాజోలిబండ ఆనకట్ట నుంచి కుడివైపున 160 కిలో మీటర్ల పొడవైన ప్రధాన కాలువ నిర్మాణం కోసం 1387 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. అలాగే 4 పంప్ హౌస్​ల నిర్మాణం కోసం 167 ఎకరాలు, 4 చోట్ల రిజర్వాయర్ల నిర్మాణం కోసం 2290 ఎకరాలు, రిజర్వాయర్ల నుంచి డిస్ట్రిబ్యూటరీలను తవ్వేందుకు 2025 ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉంది. పథకం నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైతే... తమకు మెరుగైన పరిహారం ఇచ్చాకే భూసేకరణ చేయాలని రైతులు అంటున్నారు.

ప్రస్తుతం రాజోలిబండ ఆనకట్ట దిగువన కొన్ని ఎత్తిపోతల పథకాలు ఉన్నా నదిలో పారే కొద్దిపాటి నీటి కోసం రైతులు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి. తమ పొలాల్లో నీటి తడి పెట్టుకోవాలంటే లక్షలు ఖర్చు చేయాల్సిందే. ఒక్కో రైతూ 4-5 లక్షల రూపాయల వ్యయంతో పైపులైన్లు వేసుకుంటున్న దుస్థితి నెలకొంది. స్థానిక ప్రజాప్రతినిధులు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెబుతున్నా పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని ప్రాంతాలకూ నీరు వచ్చేలా డిస్ట్రిబ్యూటరీలు తవ్వాలని కూడా రైతుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తున్నాయి. రాజోలిబండ ఆనకట్ట హెడ్ రెగ్యులేటర్ సివిల్ పనులు పూర్తయినా.. ఇంకా గేట్లు అనుసంధాన పనులు చేయాల్సి ఉంది.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.