ETV Bharat / state

వెయ్యికి చేరువలో కరోనా కేసులు... ఆదోనిలోనే అధికం

author img

By

Published : Jun 14, 2020, 8:13 PM IST

కర్నూలు జిల్లాలో ఇవాళ ఒక్కరోజే 51 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో కరోనా బారినపడినవారి సంఖ్య 996కు చేరింది. జిల్లాలో అత్యధికంగా కేసులు ఆదోనిలో నమోదవటం.. ఆ ప్రాంత ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

corona cases increasing in kurnool dst reaches nearly  thousand
corona cases increasing in kurnool dst reaches nearly thousand

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ అధికమవుతున్నాయి. నేడు జిల్లాలో మరో 51 కేసులు నమోదయ్యాయి. ఆదోని ప్రాంతంలోనే కేసుల సంఖ్య అధికంగా వస్తుండటంపై.. అధికారులు ఆ ప్రాంతంలో లాక్ డౌన్ విధించారు.

ఈ రోజు నమోదైన కేసుల్లో.. ఆదోనిలో 27, కర్నూలులో 6, కౌతాళంలో 3, నంద్యాలలో 3, తుగ్గలి 1, ఎమ్మిగనూరు రూరల్​లో 2, ఆదోని రూరల్​లో 3, నంద్యాల రూరల్​లో 5, మరో ప్రాంతంలో ఒక కేసు నమోదు అయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు 996 మందికి కరోనా సోకింది. ఆదివారం కరోనా నుంచి పూర్తిగా కోలుకుని 16 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలిపి.. వైరస్ నుంచి పూర్తిగా కోలుకొన్న వారి సంఖ్య 829 కి చేరింది.

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ అధికమవుతున్నాయి. నేడు జిల్లాలో మరో 51 కేసులు నమోదయ్యాయి. ఆదోని ప్రాంతంలోనే కేసుల సంఖ్య అధికంగా వస్తుండటంపై.. అధికారులు ఆ ప్రాంతంలో లాక్ డౌన్ విధించారు.

ఈ రోజు నమోదైన కేసుల్లో.. ఆదోనిలో 27, కర్నూలులో 6, కౌతాళంలో 3, నంద్యాలలో 3, తుగ్గలి 1, ఎమ్మిగనూరు రూరల్​లో 2, ఆదోని రూరల్​లో 3, నంద్యాల రూరల్​లో 5, మరో ప్రాంతంలో ఒక కేసు నమోదు అయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు 996 మందికి కరోనా సోకింది. ఆదివారం కరోనా నుంచి పూర్తిగా కోలుకుని 16 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలిపి.. వైరస్ నుంచి పూర్తిగా కోలుకొన్న వారి సంఖ్య 829 కి చేరింది.

ఇదీ చూడండి:

కరోనా ప్రభావం... ఆన్​లైన్​లో నామకరణం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.