ETV Bharat / state

సంకల్​బాగ్ ఘాట్​లో పుష్కరాలు ప్రారంభించిన సీఎం జగన్

author img

By

Published : Nov 20, 2020, 2:22 PM IST

Updated : Nov 20, 2020, 2:30 PM IST

కర్నూలు నగరంలోని సంకల్ బాగ్ పుష్కర ఘాట్​లో తుంగభద్ర పుష్కరాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. సంప్రదాయ దుస్తులతో తుంగభద్రమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

cm-jagan
cm-jagan
సంకల్​బాగ్ ఘాట్​లో పుష్కరాలు ప్రారంభించిన సీఎం జగన్

కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. సంకల్‌బాగ్ పుష్కర ఘాట్‌ వద్ద సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమంలో పాల్గొన్నారు. ఇవాళ్టి నుంచి డిసెంబర్ 1 వరకు తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి. తుంగభద్ర పుష్కరాల కోసం కర్నూలు జిల్లాలో 23 ఘాట్లు ఏర్పాటు చేశారు. జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో పుష్కరాలకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో పుష్కరాలకు ఏర్పాట్లు చేశారు. కర్నూలు నియోజకవర్గంలో 7, కోడుమూరు నియోజకవర్గంలో 5, మంత్రాలయం నియోజకవర్గంలో 8, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 2 ఘాట్లను సిద్ధం చేశారు. నందికొట్కూరు నియోజకవర్గంలో ఒక ఘాట్ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: మంత్రాలయంలో ఘనంగా ప్రారంభమైన తుంగభద్ర పుష్కరాలు

సంకల్​బాగ్ ఘాట్​లో పుష్కరాలు ప్రారంభించిన సీఎం జగన్

కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. సంకల్‌బాగ్ పుష్కర ఘాట్‌ వద్ద సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమంలో పాల్గొన్నారు. ఇవాళ్టి నుంచి డిసెంబర్ 1 వరకు తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి. తుంగభద్ర పుష్కరాల కోసం కర్నూలు జిల్లాలో 23 ఘాట్లు ఏర్పాటు చేశారు. జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో పుష్కరాలకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో పుష్కరాలకు ఏర్పాట్లు చేశారు. కర్నూలు నియోజకవర్గంలో 7, కోడుమూరు నియోజకవర్గంలో 5, మంత్రాలయం నియోజకవర్గంలో 8, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 2 ఘాట్లను సిద్ధం చేశారు. నందికొట్కూరు నియోజకవర్గంలో ఒక ఘాట్ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: మంత్రాలయంలో ఘనంగా ప్రారంభమైన తుంగభద్ర పుష్కరాలు

Last Updated : Nov 20, 2020, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.