ETV Bharat / state

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 18 మందికి గాయాలు

author img

By

Published : Mar 20, 2020, 12:55 PM IST

రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 18 మంది గాయపడిన సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

auto accidents in kurnool
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 18 మందికి గాయాలు
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 18 మందికి గాయాలు

కర్నూలు జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

డివైడర్​ను ఢీకొన్న ఆటో...ఆరుగురికి గాయాలు

కర్నూలు జిల్లా పాణ్యం వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. వెల్దుర్తి మండలం సిద్ధనగట్టు గ్రామం నుంచి బలపనూరుకు కూలీలతో వెళ్తోన్న ఆటో.. పాణ్యం వద్ద వంతెనపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడ్డ ఆరుగురిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

ఆటోను ఢీకొన్న మరో ఆటో...12 మందికి గాయాలు

ఆళ్లగడ్డ పరిధిలోని చింతకొమ్మదిన్నె వద్ద 40వ జాతీయ రహదారిపై ఆటోను వెనుక నుంచి మరో ఆటో ఢీ కొన్న ఘటనలో 12 మంది కూలీలు గాయపడ్డారు. స్థానికులు వీరిని ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. మెరుగైన చికిత్స కోసం నంద్యాలకు తరలించారు. గాయపడిన వారు రుద్రవరం మండలం నక్కలదిన్నె గ్రామస్థులుగా గుర్తించారు. వీరందరూ చాగలమర్రి మండలంలోని మల్లెవేముల గ్రామంలోని పూలతోటలో కూలి పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి...అనంతపురంలో తాగుబోతు వీరంగం...!

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 18 మందికి గాయాలు

కర్నూలు జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

డివైడర్​ను ఢీకొన్న ఆటో...ఆరుగురికి గాయాలు

కర్నూలు జిల్లా పాణ్యం వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. వెల్దుర్తి మండలం సిద్ధనగట్టు గ్రామం నుంచి బలపనూరుకు కూలీలతో వెళ్తోన్న ఆటో.. పాణ్యం వద్ద వంతెనపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడ్డ ఆరుగురిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

ఆటోను ఢీకొన్న మరో ఆటో...12 మందికి గాయాలు

ఆళ్లగడ్డ పరిధిలోని చింతకొమ్మదిన్నె వద్ద 40వ జాతీయ రహదారిపై ఆటోను వెనుక నుంచి మరో ఆటో ఢీ కొన్న ఘటనలో 12 మంది కూలీలు గాయపడ్డారు. స్థానికులు వీరిని ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. మెరుగైన చికిత్స కోసం నంద్యాలకు తరలించారు. గాయపడిన వారు రుద్రవరం మండలం నక్కలదిన్నె గ్రామస్థులుగా గుర్తించారు. వీరందరూ చాగలమర్రి మండలంలోని మల్లెవేముల గ్రామంలోని పూలతోటలో కూలి పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి...అనంతపురంలో తాగుబోతు వీరంగం...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.