ETV Bharat / state

గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్టు

కర్నూలులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న పది మంది ముఠాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి పదిహేడు కేజీల గంజాయి, 22 మిల్లీ గ్రాముల ఎల్​ఎస్​డీ స్టామ్స్​, ఎనిమిది సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

author img

By

Published : May 22, 2021, 2:01 PM IST

marijuana
పోలీసల అదుపులో గంజాయి ముఠా సభ్యులు

కర్నూలులో గంజాయి, ఎల్​ఎస్​డీ స్టామ్స్​ రవాణా చేస్తున్న 10 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గిద్దలూరు, తుని నుంచి గంజాయి, ఎల్​ఎస్​డీ స్టామ్స్ కొనుగోలు చేశారని సెబ్ అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి తెలిపారు. ఎల్​ఎస్​డీ స్టామ్స్ పట్టుకోవటం మొదటి సారని తెలిపారు. అది గుర్తుపట్టలేని విధంగా ఉంటుందని ఆమె చెప్పారు.

వాటిని ‘జడ్​ఈబీ పే’ యాప్​ను ఉపయోగించి ఇండియన్ కరెన్సీని బిట్ కాయిన్​గా మార్చి ఆన్​లైన్​లో కొనుగోలు చేసినట్లు చెప్పారు. నిందితుల నుంచి పదిహేడు కేజీల గంజాయి, 22 మిల్లీ గ్రాముల ఎల్​ఎస్​డీ స్టామ్స్​, ఎనిమిది సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సీజ్​ చేసిన గంజాయి విలువ రూ.4,25,000 ఉంటుందని చెప్పారు.

కర్నూలులో గంజాయి, ఎల్​ఎస్​డీ స్టామ్స్​ రవాణా చేస్తున్న 10 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గిద్దలూరు, తుని నుంచి గంజాయి, ఎల్​ఎస్​డీ స్టామ్స్ కొనుగోలు చేశారని సెబ్ అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి తెలిపారు. ఎల్​ఎస్​డీ స్టామ్స్ పట్టుకోవటం మొదటి సారని తెలిపారు. అది గుర్తుపట్టలేని విధంగా ఉంటుందని ఆమె చెప్పారు.

వాటిని ‘జడ్​ఈబీ పే’ యాప్​ను ఉపయోగించి ఇండియన్ కరెన్సీని బిట్ కాయిన్​గా మార్చి ఆన్​లైన్​లో కొనుగోలు చేసినట్లు చెప్పారు. నిందితుల నుంచి పదిహేడు కేజీల గంజాయి, 22 మిల్లీ గ్రాముల ఎల్​ఎస్​డీ స్టామ్స్​, ఎనిమిది సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సీజ్​ చేసిన గంజాయి విలువ రూ.4,25,000 ఉంటుందని చెప్పారు.

ఇదీ చదవండి:

దాములూరు వద్ద తెలంగాణ మద్యం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.