ప్రైవేటు ఆసుపత్రిల్లో అధిక ఫీజుల వసూలును అరికట్టాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలులో ధర్నా చేశారు. కరోనా పేరుతో లక్షల రూపాయల బిల్లులు వసూలు చేస్తున్నారని నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ముందు వారు ఆందోళన చేశారు. కరోనా వైద్యానికి రోజుకు పదివేల రూపాయలకు మించి ఫీజు వసులు చేయకూడదని ప్రభుత్వం చెబుతున్న.. ప్రైవేటు ఆసుపత్రులు పట్టించుకోవట్లేదని నేతలు మండిపడ్డారు. లక్షల రూపాయల బిల్లులు వసూలు చేస్తూ.. అధికారులు కనీసం చర్యలు తీసుకోవట్లేదని శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులను సీజ్ చెేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి. 18 ఏళ్లు దాటితే కచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే!