ఇదీ చూడండి:
శేష వాహనంపై భక్తులకు లక్ష్మీనరసింహుడి అనుగ్రహం
కర్నూలు జిల్లా అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రహ్లాద వరద స్వామి.. స్వర్ణంతో తయారుచేసిన శేష వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి, భూదేవి సహిత ప్రహ్లాద స్వామికి అర్చకులు విశేష పూజలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. దిగువ అహోబిలంలో స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అనుగ్రహమిచ్చారు.
శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి