ETV Bharat / state

LOKESH: మీరు సజ్జల గుమస్తా కాదు..రాష్ట్ర డీజీపీ: లోకేశ్

author img

By

Published : Sep 4, 2021, 7:04 PM IST

రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్​పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. దిశ చట్టం చట్టబద్ధం కాలేదని డీజీపీ సీఎం, మంత్రులకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు కనీసం స్పందన కూడా కరువైందని వాపోయారు. గౌతమ్ సవాంగ్ షాడో హోంమంత్రి సజ్జల దగ్గర పనిచేస్తున్న గుమస్తా కాదు, రాష్ట్ర డీజీపీ అని గుర్తుపెట్టుకోవాలని లోకేశ్ మండిపడ్డారు.

DGP Gowtham Sawang
డీజీపీ గౌతమ్ సవాంగ్

దిశ చట్టం చట్టబద్ధం కాలేదని డీజీపీ.. సీఎం, మంత్రులకు అవగాహన కల్పించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కోరారు. ఈ చట్టం ద్వారా నిందితులకు ఉరిశిక్ష వేశాం అని పగటి కలలుకంటున్న సీఎం, మంత్రులకు డీజీపీ అవగాహన కల్పించాలని హితవు పలికారు.

మీరు సజ్జల గుమస్తా కాదు..రాష్ట్ర డీజీపీ -లోకేశ్

"డీజీపీ పదవి కోసం గౌతమ్ సవాంగ్ ఇంతగా దిగజారిపోవాలా... స్వప్రయోజనాల కోసం పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను తాడేపల్లి ప్యాలెస్​కు తాకట్టు పెట్టడం ఆయన కెరీర్​లో మాయని మచ్చగా మిగిలిపోతుందని లోకేశ్ మండిపడ్డారు. దిశ చట్టాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకున్న జగన్ రెడ్డిని వదిలేసి ప్రతిపక్షాలపై ఏడుస్తారెందుకని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడిఓ సరళపై వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి చేసిన ఘటనలో ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తే మౌనం దాల్చారని ధ్వజమెత్తారు. సీఎం ఇంటి పక్కనే జరిగిన అత్యాచార ఘటనలో నిందితులను పట్టుకున్నారా అని ప్రశ్నిస్తే సమాధానం దాటవేశారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల కామక్రీడలకు బలైపోయిన మహిళల ఫిర్యాదుపై స్పందించమంటే నీళ్లు నముతున్నారని దుయ్యబట్టారు. గౌతం సవాంగ్ షాడో హోంమంత్రి సజ్జల దగ్గర పనిచేస్తున్న గుమస్తా కాదు, రాష్ట్ర డీజీపీ అని గుర్తుపెట్టుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు". నాడు-నేడు పేరిట డీజీపీ వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్ కు జతచేశారు.

గౌతమ్ సవాంగ్ తక్షణమే రాజీనామా చేయాలి..

డీజీపీ చెప్పినట్లుగా దిశ చట్టంపై కోర్టులనెందుకడగాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య నిలదీశారు. దిశ చట్టం ఉందని ఏ కోర్టూ చెప్పలేదని.. 21రోజుల్లో శిక్షిస్తామని ఎక్కడా పేర్కొనలేదన్నారు. ఈ చట్టంపై మాట్లాడింది పోలీసులు, సీఎం, మంత్రులే. కోర్టులను అడగమని న్యాయస్థానాల్ని కించపరిచేలా మాట్లాడినందుకు డీజీపీపై పరువునష్టం కేసు వేస్తాం. డీజీపీగా కొనసాగే నైతిక అర్హత కోల్పోయినందుకు గౌతమ్ సవాంగ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎవరికీ లేనన్ని క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నది ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక్కరేనని ఎద్దేవా చేశారు. చింతమనేని పేరుకొడితే కేసులన్నీ వచ్చాయన్న డీజీపీ.. జగన్మోహన్ రెడ్డి పేరెందుకు కొట్టలేదు" అని నిలదీశారు.

ఇదీ చదవండి: DGP: 'రాజకీయ ప్రయోజనాల కోసమే దిశ పోలీసుస్టేషన్ల ముట్టడి'

దిశ చట్టం చట్టబద్ధం కాలేదని డీజీపీ.. సీఎం, మంత్రులకు అవగాహన కల్పించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కోరారు. ఈ చట్టం ద్వారా నిందితులకు ఉరిశిక్ష వేశాం అని పగటి కలలుకంటున్న సీఎం, మంత్రులకు డీజీపీ అవగాహన కల్పించాలని హితవు పలికారు.

మీరు సజ్జల గుమస్తా కాదు..రాష్ట్ర డీజీపీ -లోకేశ్

"డీజీపీ పదవి కోసం గౌతమ్ సవాంగ్ ఇంతగా దిగజారిపోవాలా... స్వప్రయోజనాల కోసం పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను తాడేపల్లి ప్యాలెస్​కు తాకట్టు పెట్టడం ఆయన కెరీర్​లో మాయని మచ్చగా మిగిలిపోతుందని లోకేశ్ మండిపడ్డారు. దిశ చట్టాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకున్న జగన్ రెడ్డిని వదిలేసి ప్రతిపక్షాలపై ఏడుస్తారెందుకని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడిఓ సరళపై వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి చేసిన ఘటనలో ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తే మౌనం దాల్చారని ధ్వజమెత్తారు. సీఎం ఇంటి పక్కనే జరిగిన అత్యాచార ఘటనలో నిందితులను పట్టుకున్నారా అని ప్రశ్నిస్తే సమాధానం దాటవేశారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల కామక్రీడలకు బలైపోయిన మహిళల ఫిర్యాదుపై స్పందించమంటే నీళ్లు నముతున్నారని దుయ్యబట్టారు. గౌతం సవాంగ్ షాడో హోంమంత్రి సజ్జల దగ్గర పనిచేస్తున్న గుమస్తా కాదు, రాష్ట్ర డీజీపీ అని గుర్తుపెట్టుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు". నాడు-నేడు పేరిట డీజీపీ వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్ కు జతచేశారు.

గౌతమ్ సవాంగ్ తక్షణమే రాజీనామా చేయాలి..

డీజీపీ చెప్పినట్లుగా దిశ చట్టంపై కోర్టులనెందుకడగాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య నిలదీశారు. దిశ చట్టం ఉందని ఏ కోర్టూ చెప్పలేదని.. 21రోజుల్లో శిక్షిస్తామని ఎక్కడా పేర్కొనలేదన్నారు. ఈ చట్టంపై మాట్లాడింది పోలీసులు, సీఎం, మంత్రులే. కోర్టులను అడగమని న్యాయస్థానాల్ని కించపరిచేలా మాట్లాడినందుకు డీజీపీపై పరువునష్టం కేసు వేస్తాం. డీజీపీగా కొనసాగే నైతిక అర్హత కోల్పోయినందుకు గౌతమ్ సవాంగ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎవరికీ లేనన్ని క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నది ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక్కరేనని ఎద్దేవా చేశారు. చింతమనేని పేరుకొడితే కేసులన్నీ వచ్చాయన్న డీజీపీ.. జగన్మోహన్ రెడ్డి పేరెందుకు కొట్టలేదు" అని నిలదీశారు.

ఇదీ చదవండి: DGP: 'రాజకీయ ప్రయోజనాల కోసమే దిశ పోలీసుస్టేషన్ల ముట్టడి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.