ETV Bharat / state

పైకప్పు పెచ్చులూడి ఇంజనీర్​ భార్య మృతి... ముగ్గురికి గాయాలు

author img

By

Published : Jun 25, 2020, 8:34 AM IST

Updated : Jun 25, 2020, 4:39 PM IST

కృష్ణా జిల్లా గుడివాడలో విషాదం జరిగింది. నీటిపారుదల శాఖ ఏఈ నాగేశ్వరరావు కుటుంబం గుడివాడలోని బైపాస్ రోడ్డులో నివాసముంటుంది. వారు నిద్రిస్తున్న గదిలో ఒక్కసారిగా స్లాబ్ పెచ్చులూడి మీద పడ్డాయి. నాగేశ్వరరావు కుటుంబసభ్యులు గాయాలపాలయ్యారు. ఏఈ భార్య లక్ష్మీ చికిత్స పొందుతూ మృతి చెందింది.

women killed and three people were injured in a building slop falling on them at gudivada in krishna district
భవనం పెచ్చులూడి మహిళ మృతి

కృష్ణా జిల్లా గుడివాడ బైపాస్ రోడ్డులో ఓ భవనం మొదటి అంతస్తులో నిద్రిస్తున్న కుటుంబంపై తెల్లవారుజామున స్లాబ్ పెచ్చులూడి పడ్డాయి. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. నీటిపారుదల శాఖలో ఏఈగా పనిచేస్తున్న నాగేశ్వరావు కుటుంబం కొంత కాలంగా ఆ ఇంట్లో అద్దెకుంటున్నారు. భవనం బాగానే ఉన్నప్పటికీ ఒక్కసారిగా స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. నాగేశ్వరరావు, అతని భార్య లక్ష్మి, తన ఇద్దరు కుమారులు తీవ్రంగా గాయపడ్డారు. చుట్టుపక్కల వారు వారిని ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ లక్ష్మి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లా గుడివాడ బైపాస్ రోడ్డులో ఓ భవనం మొదటి అంతస్తులో నిద్రిస్తున్న కుటుంబంపై తెల్లవారుజామున స్లాబ్ పెచ్చులూడి పడ్డాయి. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. నీటిపారుదల శాఖలో ఏఈగా పనిచేస్తున్న నాగేశ్వరావు కుటుంబం కొంత కాలంగా ఆ ఇంట్లో అద్దెకుంటున్నారు. భవనం బాగానే ఉన్నప్పటికీ ఒక్కసారిగా స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. నాగేశ్వరరావు, అతని భార్య లక్ష్మి, తన ఇద్దరు కుమారులు తీవ్రంగా గాయపడ్డారు. చుట్టుపక్కల వారు వారిని ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ లక్ష్మి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

అప్పు తీర్చమన్నందుకు.. విశాంత్ర ఉద్యోగి దారుణహత్య

Last Updated : Jun 25, 2020, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.