రసాయన పరిశ్రమ నుంచి వచ్చే విష వాయువుల వల్ల ఇబ్బందులు పడుతున్నామని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్ పేటలో గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. నిబంధనలకి విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్యాక్టరీని మూసివేయాలని గ్రామ ప్రజల ధర్నా చేశారు. ఈ కెమికల్ ఫ్యాక్టరీల వలన వచ్చే కాలుష్యంతో గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడుతూ అనారోగ్యాలకు గురౌతున్నారని వాపోయారు.
ఇవీ చదవండి: 40 కేజీల గంజాయిని పట్టుకున్న నూజివీడు పోలీసులు