ETV Bharat / state

అమర జవానుల్లారా... మీకివే మా నివాళులు

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఘన నివాళులు అర్పించారు. జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశం కోసం, దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల త్యాగాన్ని కొనియాడారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

author img

By

Published : Feb 15, 2020, 12:55 PM IST

Tributes to immortal soldiers throughout the state
రాష్ట్రవ్యాప్తంగా అమర జవాన్లకు నివాళులు


గుంటూరు జిల్లాలో...
పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన అమరవీరులకు అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నివాళులర్పించారు. విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ట్రస్టు నిర్వాహకులు తెలిపారు. వాసవి యూత్ ఆధ్వర్యంలో తెనాలిలో వీర సైనికులకు నివాళులు అర్పించి జాతీయ గీతాన్ని ఆలపించారు. సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

కృష్ణా జిల్లాలో...
పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు విశ్వహిందూ పరిషత్ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. మైలవరంలో అమర జవాన్లను స్మరిస్తూ పోలీసులు, సాయి సేవాదళ్ సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి, మిలటరీలో సేవలందించిన వారిని సన్మానించారు. అమరులైన వీర జవాన్లకు గుర్తుగా తపాల శాఖ ముద్రించిన పోస్టల్ స్టాంపును జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆవిష్కరించారు. వీర జవాన్ల చిత్రపటాలకు పూలమాల వేసి గౌరవ వందనం చేశారు. సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. అనంతరం విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. జగ్గయ్యపేటలో భాజపా ఆధ్వర్యంలో అమరులైన జవాన్లకు నివాళులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువత పాల్గొని, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

విశాఖపట్నం జిల్లాలో...
పుల్వామా దాడిలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు విశాఖ జిల్లా ఆనందపురంలో విద్యార్థులు నివాళులర్పించారు. భారత్ మాతాకీ జై అమరవీరులకు జోహార్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా అమర జవాన్లకు నివాళులు

ప్రకాశం జిల్లాలో...
ప్రకాశం జిల్లా కంభంలో అమర సైనికులకు ఘన నివాళులర్పించారు.దేశం కోసం ప్రతికూల పరిస్థితిలో అనునిత్యం పోరాడుతున్న సైనికులు పుల్వామా దాడిలో వీర మరణం చెందడం బాధాకరమని ఎంఈఓ మాధవకృష్ణారావు అన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో...
ఉగ్ర దాడిలో వీర మరణం పొందిన భారత జవాన్లను స్మరిస్తూ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో విద్యార్థులు నివాళులర్పించారు. జై జవాన్ అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.

నెల్లూరు జిల్లాలో...
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో అమరులైన జవాన్లకు గుర్తుగా.. సత్రం సెంటర్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. విదేశీ విష సంస్కృతి అయిన ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడం సమంజసం కాదని వక్తలు అభిప్రాయపడ్డారు.

ఇదీచదవండి.రామాయణం థీమ్​తో కొత్త రైలు.. మార్చి 10న ప్రారంభం!


గుంటూరు జిల్లాలో...
పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన అమరవీరులకు అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నివాళులర్పించారు. విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ట్రస్టు నిర్వాహకులు తెలిపారు. వాసవి యూత్ ఆధ్వర్యంలో తెనాలిలో వీర సైనికులకు నివాళులు అర్పించి జాతీయ గీతాన్ని ఆలపించారు. సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

కృష్ణా జిల్లాలో...
పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు విశ్వహిందూ పరిషత్ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. మైలవరంలో అమర జవాన్లను స్మరిస్తూ పోలీసులు, సాయి సేవాదళ్ సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి, మిలటరీలో సేవలందించిన వారిని సన్మానించారు. అమరులైన వీర జవాన్లకు గుర్తుగా తపాల శాఖ ముద్రించిన పోస్టల్ స్టాంపును జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆవిష్కరించారు. వీర జవాన్ల చిత్రపటాలకు పూలమాల వేసి గౌరవ వందనం చేశారు. సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. అనంతరం విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. జగ్గయ్యపేటలో భాజపా ఆధ్వర్యంలో అమరులైన జవాన్లకు నివాళులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువత పాల్గొని, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

విశాఖపట్నం జిల్లాలో...
పుల్వామా దాడిలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు విశాఖ జిల్లా ఆనందపురంలో విద్యార్థులు నివాళులర్పించారు. భారత్ మాతాకీ జై అమరవీరులకు జోహార్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా అమర జవాన్లకు నివాళులు

ప్రకాశం జిల్లాలో...
ప్రకాశం జిల్లా కంభంలో అమర సైనికులకు ఘన నివాళులర్పించారు.దేశం కోసం ప్రతికూల పరిస్థితిలో అనునిత్యం పోరాడుతున్న సైనికులు పుల్వామా దాడిలో వీర మరణం చెందడం బాధాకరమని ఎంఈఓ మాధవకృష్ణారావు అన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో...
ఉగ్ర దాడిలో వీర మరణం పొందిన భారత జవాన్లను స్మరిస్తూ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో విద్యార్థులు నివాళులర్పించారు. జై జవాన్ అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.

నెల్లూరు జిల్లాలో...
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో అమరులైన జవాన్లకు గుర్తుగా.. సత్రం సెంటర్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. విదేశీ విష సంస్కృతి అయిన ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడం సమంజసం కాదని వక్తలు అభిప్రాయపడ్డారు.

ఇదీచదవండి.రామాయణం థీమ్​తో కొత్త రైలు.. మార్చి 10న ప్రారంభం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.