కృష్ణా జిల్లా చిల్లకల్లు సమీపంలోని టోల్ ప్లాజాలో రేట్లు పెంచి అమలు చేస్తున్నారు. టోల్ ప్లాజా నుంచి వాహనాల రాకపోకలు మొదలైన నేపథ్యంలో లైట్ మోటార్, కమర్షియల్ వాహనాలపై 5 రూపాయలు, బస్సు, ట్రక్కులకు 10 రూపాయలు, భారీ వాహనాలకు రూ.20 చొప్పున టోల్ గేట్ ఛార్జీలు పెంచి వసూలు చేస్తున్నారు. ఏటా ఏప్రిల్ 1నే టోల్ ఛార్జీలు పెంచడం ఆనవాయితీగా వస్తోంది. ‘కరోనా’ కారణంగా ఈ ఏడాది టోల్ ఛార్జీల పెంపులో జాప్యం జరిగిందని నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా అధికారి విద్యాసాగర్ తెలిపారు. లాక్డౌన్లో కొన్ని సడలింపులు ఇచ్చినందున టోల్ ప్లాజాల వద్ద వాహనాలను అనుమతిస్తామని చెప్పారు.
ఇవీ చదవండి : ఈ ప్రాంతాల్లో కరోనా తీవ్రత అధికం: హోంశాఖ